హేమంత్ హత్య కేసులో మరో ట్విస్టు

హేమంత్ హత్య కేసులో నిందితుల కస్టడి నేడు మూడో రోజుకు చేరుకుంది. మొన్న చర్లపల్లి జైలు నుంచి నిందితులను గచ్చిబౌలి పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు.

హేమంత్ హత్య కేసులో మరో ట్విస్టు
Follow us

|

Updated on: Oct 02, 2020 | 1:31 PM

హేమంత్ హత్య కేసులో నిందితుల కస్టడి నేడు మూడో రోజుకు చేరుకుంది. మొన్న చర్లపల్లి జైలు నుంచి నిందితులను గచ్చిబౌలి పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఇవాళ కూడా మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పోలీసు కస్టడీలో లక్ష్మారెడ్డి, యుగంధర్ రెడ్డిలు పలు కీలక అంశాలు వెల్లడిస్తున్నట్లు సమాచారం. నిన్న ప్రాణం కంటే పరువే ముఖ్యమని.. అందుకే హేమంత్‌ను హత్యమార్చినట్లు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఒప్పుకున్నాడు.హేమంత్ హత్యకు మొదట వేరే సుపారి గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు యుగంధర్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించారు. ఒప్పందం కుదిరాక సుపారీ గ్యాంగ్ స్పందించకపోవడంతో హేమంత్ హత్య వాయిదా పడిందన్నారు. దీంతో తనకు పరిచయం ఉన్న బిచ్చు యాదవ్ తో మరో ఒప్పందం కుదుర్చుకున్న యుగంధర్ రెడ్డి విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈసారి పక్కాగా.. ఫ్లాన్ అమలు చేశామని తెలిపారు. అనంతరం పోలీసులు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం నిందితులను మరోసారి పోలీసులు తీసుకెళ్లారు.