AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేల వరస రాజీనామాలతో పార్టీ ఢీలా పడుతోంది. తాజాగా మరో ఎమ్మెల్యే...

కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా
Sanjay Kasula
|

Updated on: Jul 17, 2020 | 7:51 PM

Share

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేల వరస రాజీనామాలతో పార్టీ ఢీలా పడుతోంది. తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్  పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుమిత్రా దేవి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ప్రొటెమ్ స్పీకర్ రామేశ్వర్ శర్మకు సమర్పించగా ఆయన అంగీకరించారు.

మరోవైపు ఈ ఘటన తనను ఆశ్చర్యపర్చలేదని మాజీ సీఎం కమల్‌నాథ్ అన్నారు. మరికొంత మంది పార్టీని వీడవచ్చని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులను ఎరవేసి ఆకర్షిస్తున్నారని మండిపడ్డారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నదని ఆరోపణలు గుప్పించారు.