
ఏపీలో రిపబ్లిక్ వేడుకలపై మరోసారి సస్పెన్స్ నెలకొంది. విశాఖలో ప్రభుత్వ అధికారికంగా నిర్వహించే రిపబ్లిక్ వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ సారి విజయవాడలోని మునిసిపల్ గ్రౌండ్లోనే నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో విశాఖలో రిపబ్లిక్ వేడుకల ఏర్పాట్లను అధికారులు రద్దుచేశారు. బీచ్ రోడ్డులో సన్నాహక పెరేడ్లో ఉన్న దళాలను వెనక్కి రావాలంటూ అధికారులు ఆదేశించారు.