గవర్నర్‌తో 40 నిమిషాలపాటు ముఖ్యమంత్రి జగన్ సమావేశం.. ఆ అంశంపైన ప్రధాన చర్చ

|

Jan 04, 2021 | 10:01 PM

గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్​ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిశారు. రాజ్ భవన్​కు వెళ్లిన సీఎం జగన్.. గవర్నర్​కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్‌తో ప్రత్యేకంగా...

గవర్నర్‌తో 40 నిమిషాలపాటు ముఖ్యమంత్రి జగన్ సమావేశం.. ఆ అంశంపైన ప్రధాన చర్చ
Follow us on

AP CM Jagan meet Governor : గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్​ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిశారు. రాజ్ భవన్​కు వెళ్లిన సీఎం జగన్.. గవర్నర్​కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం జగన్. 40 నిమిషాల పాటు జరిగిన వీరి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. వీటిలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్​తో సీఎం చర్చించారు.

ఫిబ్రవరిలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుండగా.. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదని ప్రభుత్వం ఇటీవలే శాసన సభలో తీర్మానం చేసింది. ఎన్నికల నిర్వహణపై ఎస్​ఈసీతో ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామాల దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించినట్లు తెలిసింది.

రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం ఘటనలు, కారణాలపై గవర్నర్​కు సీఎం వివరించినట్లు తెలిసింది. వీటితో పాటు పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్‌తో భేటీ అనంతరం సీఎం జగన్‌ నేరుగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు.

Dak Adalat : ఈ నెల 28న ‘పెన్షన్ అదాలత్’..పెన్షనర్ల సమస్యలకు ఇదో వేదిక.. ప్రకటన విడుదల చేసిన డాక్ సదన్..
Sankranti Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..జనవరి  11 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు