Breaking:ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర నిలిపివేత

|

Jul 21, 2020 | 8:24 PM

. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్‌ విస్తరిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జీసీ మర్ము అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Breaking:ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర నిలిపివేత
Follow us on

కరోనా మహమ్మారి ప్రభావం దేవాలయాలపై కూడా పడుతోంది. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్‌ విస్తరిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జీసీ మర్ము అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అమర్‌నాథ్‌ యాత్ర అంత శ్రేయస్కరం కాదని సమావేశం నిర్ణయించింది. అందుకే ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నామని సమావేశం అనంతరం అమర్‌నాథ్‌ బోర్డు ప్రకటించింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఉదయం, సాయంత్రం వర్చువల్‌ దర్శన సదుపాయాన్ని మాత్రం యథావిధిగా కొనసాగిస్తామని వెల్లడించింది. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తూ ఈ యాత్ర కొనసాగించాలని భావించారు అయితే, కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతేడాది ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్ర సగంలోనే నిలిచిపోయింది. దీంతో రెండు సంవత్సరాలుగా అమరనాథుడి దర్శనాన్ని భక్తులు నోచుకోలేకపోయారు,