AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో గోవాలో అద్భుతం: సంజయ్‌ రౌత్‌

మహారాష్ట్ర తరువాత బీజేపీ పాలిత గోవాలో ఒక అద్భుతం జరగబోతోందని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం ప్రకటించారు. తమ  పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) మరియు కాంగ్రెస్ లతో కూడిన సంకీర్ణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయ్యాక సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి విజయ్ సర్దేసాయ్ శివసేనతో సంప్రదింపులు జరుపుతున్నారని రౌత్ తెలిపారు. “మహారాష్ట్రలో జరిగినట్లే గోవాలో కూడా ఒక కొత్త […]

త్వరలో గోవాలో అద్భుతం: సంజయ్‌ రౌత్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 29, 2019 | 11:20 PM

Share

మహారాష్ట్ర తరువాత బీజేపీ పాలిత గోవాలో ఒక అద్భుతం జరగబోతోందని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం ప్రకటించారు. తమ  పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) మరియు కాంగ్రెస్ లతో కూడిన సంకీర్ణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయ్యాక సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి విజయ్ సర్దేసాయ్ శివసేనతో సంప్రదింపులు జరుపుతున్నారని రౌత్ తెలిపారు. “మహారాష్ట్రలో జరిగినట్లే గోవాలో కూడా ఒక కొత్త రాజకీయ ఫ్రంట్ రూపుదిద్దుకుంటోంది. త్వరలో మీరు గోవాలో ఒక అద్భుతాన్ని చూస్తారు” అని సంజయ్ రౌత్ వివరించారు.

“మహారాష్ట్ర తరువాత గోవా, ఆ తరువాత మేము ఇతర రాష్ట్రాలకు వెళ్తాము. ఈ దేశంలో బీజేపీయేతర రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము” అని శివసేన నాయకుడు స్పష్టంచేశారు. తాను సంజయ్ రౌత్ ను కలిసినట్లు విజయ్ సర్దేసాయ్ ధృవీకరించారు. మహారాష్ట్రలో ఏమి జరిగిందో, గోవాలో కూడా అలా జరగాలని, ప్రతిపక్షాలు కలిసి రావాలని అయన పిలుపునిచ్చారు.