విజయనగరం : 4 నెలలుగా ఆ ఇంట్లోనే శవం..ఏంటా మిస్టరీ..!

|

Feb 09, 2020 | 9:35 AM

విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పార్వతీపురం బెలగాం వద్ద జన సంచారం ఉన్న ప్రాంతంలో  ఓ గృహం ఖాళీగా ఉంటుంది. ఆ ఇంటి ఆవరణను ఓ వ్యక్తి సిమెంట్ గోడౌన్‌గా వినియోగిస్తున్నాడు. కాగా ఈ శనివారం ఆ గోడౌన్‌ను రంగులు వేసేందుకు..ఓ వ్యక్తి లోపలికి నీళ్లు తేవడానికి వెళ్లాడు. అంతే అక్కడ సీన్ చూసి ఉరుకులు, పరుగులతో రోడ్డుపైకి కేకలు వేశాడు. లోపలికి వెళ్లిన అతడికి చీకట్లో ఏదో వస్తువు కాళ్లకు తగిలినట్టు అనిపించింది. ఏంటా అని […]

విజయనగరం : 4 నెలలుగా ఆ ఇంట్లోనే శవం..ఏంటా మిస్టరీ..!
Follow us on

విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పార్వతీపురం బెలగాం వద్ద జన సంచారం ఉన్న ప్రాంతంలో  ఓ గృహం ఖాళీగా ఉంటుంది. ఆ ఇంటి ఆవరణను ఓ వ్యక్తి సిమెంట్ గోడౌన్‌గా వినియోగిస్తున్నాడు. కాగా ఈ శనివారం ఆ గోడౌన్‌ను రంగులు వేసేందుకు..ఓ వ్యక్తి లోపలికి నీళ్లు తేవడానికి వెళ్లాడు. అంతే అక్కడ సీన్ చూసి ఉరుకులు, పరుగులతో రోడ్డుపైకి కేకలు వేశాడు. లోపలికి వెళ్లిన అతడికి చీకట్లో ఏదో వస్తువు కాళ్లకు తగిలినట్టు అనిపించింది. ఏంటా అని పరీక్షించి చూడగా అస్థిపంజరం. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

స్థానిక సబ్-ఇన్‌స్పెక్టర్ జయంతి ఘటనా స్థలిని పరిశీలించారు. నాలుగు నెలలకు ముందు..హత్యో, ఆత్మహత్యో జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లూస్ టీమ్ వచ్చి పూర్తి ఆధారాలను సేకరించింది. అయితే చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మిస్సింగ్ కేసులు ఏవీ నమోదు కాకపోవడంతో పోలీసులుకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. అసలు ఆ అస్థిపంజరం ఎవరిది..? ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా..? లేక వ్యక్తిని చంపి పడేసి వెళ్లిపోయారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.