రికార్డు స్థాయిలో వెంకన్న హుండీ ఆదాయం.. ఎంతో తెలుసా!

|

Nov 14, 2020 | 4:45 AM

ఇటీవల కాలంలో, లాక్‌డౌన్‌ తర్వాత హుండీ ఆదాయం ఇంత రావడం ఇదే మొదటిసారి. సర్వ దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో.. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో హుండీ ఆదాయం పెరిగింది..

రికార్డు స్థాయిలో వెంకన్న హుండీ ఆదాయం.. ఎంతో తెలుసా!
Follow us on

ఇటీవల కాలంలో, లాక్‌డౌన్‌ తర్వాత హుండీ ఆదాయం ఇంత రావడం ఇదే మొదటిసారి. సర్వ దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో.. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో హుండీ ఆదాయం పెరిగింది.. దీనికి తోడు దీపావళి పండుగ.. కార్తీక మాసం కావడంతో విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమల వెంకన్న హుండీ ఆదాయం పెరిగింది. లాక్‌డౌన్, కరోనా తర్వాత కాస్త తగ్గినా.. మళ్లీ హుండీ ఆదాయం పెరుగుతోంది. శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య పెరిగింది. హుండీలో రూ.3.26 కోట్లు మొక్కులుగా చెల్లించుకున్నారు. ఇటీవల కాలంలో, లాక్‌డౌన్‌ తర్వాత హుండీ ఆదాయం ఇంత రావడం ఇదే మొదటిసారి.

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం శుక్రవారం రికార్డు స్థాయిలో నమోదయ్యింది. ఇవాళ ఒక్కరోజే రూ. 3.26 కోట్ల ఆదాయం చేకూరింది. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చింది. శుక్రవారం ఒక్కరోజే శ్రీవారి హుండీకి రూ. 3.26 కోట్ల ఆదాయం చేకూరింది. ఓ అజ్ఞాత భక్తుడు రూ. 1.50 కోట్లు స్వామివారికి కానుకగా సమర్పించారు. లాక్‌డౌన్‌ అనంతరం తొలిసారి రికార్డుస్థాయిలో హుండీ ఆదాయం నమోదైంది.