భూమికంటే అతిభారీ సైజులో.. ఖగోళంలో మరో మూడు కొత్త ఉపగ్రహాలు

| Edited By:

Jul 31, 2019 | 8:15 AM

అంతరిక్ష పరిశోధనలో నిరంతరం పరిశోధనలు జరుపుతున్నారు శాస్త్రవేత్తలు. ఖగోళ రహస్యాలను ఎప్పటిప్పుడు మనకు అందించేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. ఇప్పటికే చంద్రుని వద్దకు చంద్రయాన్-2ను పంపించి ప్రపంచ దేశాల్లో మన సత్తా చాటుకున్నాం. అంతరిక్ష పరిశోధనలో ముందున్న నాసా అనేక కొత్త ఆవిష్కరణలు చేస్తూ నింగిలో ఉన్నకొత్త గ్రహాల సమాచారాన్ని తెలియజేస్తుంది. తాజాగా భూమికి 73 కాంతి సంవత్సరాల దూరంలో ఓ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న మూడు కొత్త గ్రహాలను గుర్తించారు. నాసా పరిశోధనలో వెలుగులోకి వచ్చిన […]

భూమికంటే అతిభారీ సైజులో.. ఖగోళంలో మరో మూడు కొత్త ఉపగ్రహాలు
Follow us on

అంతరిక్ష పరిశోధనలో నిరంతరం పరిశోధనలు జరుపుతున్నారు శాస్త్రవేత్తలు. ఖగోళ రహస్యాలను ఎప్పటిప్పుడు మనకు అందించేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. ఇప్పటికే చంద్రుని వద్దకు చంద్రయాన్-2ను పంపించి ప్రపంచ దేశాల్లో మన సత్తా చాటుకున్నాం. అంతరిక్ష పరిశోధనలో ముందున్న నాసా అనేక కొత్త ఆవిష్కరణలు చేస్తూ నింగిలో ఉన్నకొత్త గ్రహాల సమాచారాన్ని తెలియజేస్తుంది. తాజాగా భూమికి 73 కాంతి సంవత్సరాల దూరంలో ఓ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న మూడు కొత్త గ్రహాలను గుర్తించారు.

నాసా పరిశోధనలో వెలుగులోకి వచ్చిన ఈ మూడు ఉపగ్రహాల్లో ఒకటి భూమి పరిమాణం కంటే పెద్దగా ఉంటే, మిగిలిన రెండు ఉపగ్రహాలు భూమి పరిమాణంలో రెండింతలు ఉన్నాయని.. అయితే ఈ రెండు ఉపగ్రహాలు వాయుమయంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కొత్త గ్రహాల అన్వేషణలో నాసా.. ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్‌ను ఉపయోగించింది. దీని ప్రయోగంతోనే ఈ మూడు ఉపగ్రహాల ఉనికి ప్రపంచానికి తెలియజేసేందుకు ఉపయోగపడ్డాయని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు.

మన సౌరవ్యవస్థ పరిధి లక్ష కాంతి సంవత్సరాలు కాగా ఇందులో ఉన్న లక్షలాది నక్షత్ర మండలాల్లో మనది కూడా ఒక్కటని శాస్త్రవేత్త కేన్ తెలిపారు. కొత్తగా గుర్తించిన మూడు ఉపగ్రహాలు భూమికి 73 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయంటే మన భూమికి దగ్గరగానే ఉన్నట్టు భావించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.