తెలంగాణలో కరోనా కలకలం.. ఇవాళ ఒక్కరోజే..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణలో

తెలంగాణలో కరోనా కలకలం.. ఇవాళ ఒక్కరోజే..
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2020 | 10:17 PM

Coronavirus in Telangana: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 5290 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 1590 కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 23902 కేసులు నమోదు కాగా, 295 మంది మృతి చెందారు.

రాష్ట్రంలో ఇవాళ నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 1277 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 82, మేడ్చల్‌ జిల్లాలో 125, సంగారెడ్డి జిల్లాలో 19, మహబూబ్ నగర్‌ జిల్లాలో 19, నల్గొండ జిల్లాలో 14, సూర్యాపేటలో 23 కేసులు నమోదయ్యాయి. గత పది రోజులుగా తెలంగాణలో అత్యధికంగా కేసులు నమోదవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

కాగా.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 12703 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 10904 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 1166 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

[svt-event date=”05/07/2020,10:16PM” class=”svt-cd-green” ]

[/svt-event]