పూజా పాత్రలో జాన్వీ!

'బాహుబలి' తరువాత టాలీవుడ్‌ స్థాయి చాలానే పెరిగిపోయింది. ఇక్కడ సైతం ఎన్నో వైవిధ్య కథలు పుట్టుకొస్తున్నాయి.

పూజా పాత్రలో జాన్వీ!
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2020 | 8:13 PM

Janhvi Kapoor in Pooja Hegde Role:‘బాహుబలి’ తరువాత టాలీవుడ్‌ స్థాయి చాలానే పెరిగిపోయింది. ఇక్కడ సైతం ఎన్నో వైవిధ్య కథలు పుట్టుకొస్తున్నాయి. దీంతో అందరి దృష్టి టాలీవుడ్‌పై పడింది. ముఖ్యంగా టాలీవుడ్‌పై కన్నేసిన బాలీవుడ్‌ ఇక్కడి సినిమాలను అక్కడ రీమేక్‌ చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని చిత్రాలు అక్కడ రీమేక్‌ అయ్యి బ్లాక్‌బస్టర్‌ అవ్వగా.. మరో అరడజన్‌కి పైగా చిత్రాల రీమేక్‌ రైట్లను బాలీవుడ్ నిర్మాతలు కొనుగోలు చేశారు. అందులో అల వైకుంఠపురములో కూడా ఒకటి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇక్కడ మంచి విజయం సాధించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక త్వరలోనే ఈ సినిమా హిందీలో రీమేక్ అవ్వబోతుంది.

ఇందులో కార్తీక్ ఆర్యన్‌, బన్నీ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ని తీసుకోవాలని మేకర్లు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇందులో నటించేందుకు ఒప్పుకుంటే పూజా హెగ్డే పాత్రలో జాన్వీ కనిపించనుంది. కాగా జాన్వీ నటించిన గుంజనా సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌ ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Read This Story Also: ‘నాజి స్వస్తిక్’ మాస్క్‌లు ధరించిన జంటపై నిషేధం