‘నాజి స్వస్తిక్’ మాస్క్లు ధరించిన జంటపై నిషేధం
నాజి స్వస్తిక్ చిహ్నలతో ఉన్న మాస్క్లను ధరించిన ఓ జంటపై వాల్ట్మార్ట్ సంస్థ వచ్చే ఏడాది వరకు నిషేధం విధించారు.
Couple wore Swastika Masks: నాజి స్వస్తిక్ చిహ్నలతో ఉన్న మాస్క్లను ధరించిన ఓ జంటపై వాల్ట్మార్ట్ సంస్థ వచ్చే ఏడాది వరకు నిషేధం విధించారు. ఈ ఘటన మిన్నెసోటలోని మార్షల్లో జరిగింది. శనివారం ఈ జంట వాల్డ్మార్ట్లోకి వెళ్లగా.. అక్కడకు వెళ్లిన ఓ కస్టమర్ వారిని వీడియో తీసి, స్టోర్ మేనేజర్కి ఫిర్యాదు చేశారు. ఆ వీడియోలో మహిళ మాట్లాడుతూ.. తాను నాజిని కాదని, కానీ అమెరికా ఎన్నికల్లో జోయ్ బిడెన్కి ఓటు వేయకపోతే ఏం జరుగుతుందో చెప్పేందుకే ఇలా చేశానని అన్నారు. ప్రస్తుతం సోషలిస్ట్ స్టేట్లో మనం ఉన్నామని అందులోని వ్యక్తి చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై వాల్ట్మార్ట్ స్పోక్స్విమెన్ మాట్లాడుతూ.. వారిని ఏడాది పాటు బ్యాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక వీరిద్దరికి పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
Read This Story Also: బెంగళూరులో 12వేలను దాటేసిన కంటైన్మెంట్ జోన్లు