తొందరపడుతోన్న చందమామ.. వినకుండానే..!

చందమామ కాజల్‌కు మరీ గడ్డుకాలమేమీ నడవడం లేదు. గత ఏడాది పెద్దగా విజయాలు లేనప్పటికీ.. ప్రస్తుతం ఆమె చేతిలో మంచి ఆఫర్లే ఉన్నాయి. కానీ సినిమాల విషయంలో కాజల్ తొందరపడుతోందట.

తొందరపడుతోన్న చందమామ.. వినకుండానే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 02, 2020 | 9:05 PM

చందమామ కాజల్‌కు మరీ గడ్డుకాలమేమీ నడవడం లేదు. గత ఏడాది పెద్దగా విజయాలు లేనప్పటికీ.. ప్రస్తుతం ఆమె చేతిలో మంచి ఆఫర్లే ఉన్నాయి. కానీ సినిమాల విషయంలో కాజల్ తొందరపడుతోందట. అవకాశాలు రావన్న భయమో..? లేక వచ్చిన అవకాశాలు ఎందుకు పోగొట్టుకోవాలి..? అన్న కారణమో తెలీదు గానీ.. స్క్రిప్ట్‌లు వినకుండానే సినిమాలకు ఒప్పుకుంటుందట కాజల్. చిరంజీవి నటిస్తోన్న ఆచార్యలో త్రిష తప్పుకున్న తరువాత దర్శకుడు కొరటాల శివ ఆ పాత్ర కోసం కాజల్‌కు కాల్ చేశారట. ఇక తన పాత్ర గురించి వినకుండానే ఆ సినిమాకు ఓకే చెప్పిందట ఈ భామ. అంతేకాదు విజయ్‌ హీరోగా మురగదాస్ తెరకెక్కిస్తోన్న తుపాకీ సీక్వెల్‌ కథను వినకుండానే ఆ మూవీకి ఓకే చెప్పిందట. త్వరలోనే దీనికి సంబంధించి డిజిటల్ సంతకం చేసేందుకు కూడా ఆమె రెడీ అయినట్లు తెలుస్తోంది.

అయితే వినకుండా సినిమాలకు సంతకం చేస్తే వచ్చే ఇబ్బందుల గురించి కాజల్‌కు తెలీనీదేమీ కాదు. ఇప్పటికీ తమకు స్క్రిప్ట్‌లో ఒకటి చెప్పి, తమ పాత్రను మరో విధంగా తీశారని చెప్పిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. మరి అవన్నీ తెలిసి కూడా కాజల్ ఎందుకు అంత తొందరపడుతుందో ఆ భామకే తెలియాలి. కాగా ప్రస్తుతం కాజల్.. తెలుగులో చిరంజీవి ఆచార్య, మంచు విష్ణు మోసగాళ్లు, సురేష్ ప్రొడక్షన్ తెరకెక్కిస్తోన్న ఓ కొరియన్ రీమేక్, కోలీవుడ్‌లో కమల్ హాసన్ ఇండియన్‌ 2, దుల్కర్ సల్మాన్ హే సినామికా.. హిందీలో ముంబయి సగ చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు తమిళ్‌లో ఆమె నటించిన క్వీన్ రీమేక్‌ పారిస్ పారిస్ విడుదలకు సిద్ధంగా ఉంది.

Read This Story Also: చిరు-మోహన్‌ బాబు ఫ్రెండ్‌షిప్‌.. అసూయగా ఉందన్న హీరో..!