చెక్కుచెదరని జైషే సంస్థ మదర్సా.. దాడులు నిజం కావా..!

పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడుల గురించి రెండు దేశాలు అధికారికంగా ప్రకటన ఇచ్చినప్పటికీ.. రాయిటర్స్ అనే న్యూస్ ఏజెన్సీ మాత్రం భిన్న వాదనలు వినిపిస్తోంది. భారత్ దాడులు జరిపిన బాలకోట్‌లోని భవనాలకు ఎలాంటి నష్టం జరగలేదని ఆ సంస్థ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దానికి సంబంధించిన శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని ఓ సంస్థ తీసిన శాటిలైట్ చిత్రాలను రాయిటర్స్ ఏజెన్సీ బయటకు విడుదల చేసింది. ఆ చిత్రాలను చూస్తే బాల్‌కోట్‌ మీద బాంబులు పడ్డాయని […]

చెక్కుచెదరని జైషే సంస్థ మదర్సా.. దాడులు నిజం కావా..!
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 5:03 PM

పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడుల గురించి రెండు దేశాలు అధికారికంగా ప్రకటన ఇచ్చినప్పటికీ.. రాయిటర్స్ అనే న్యూస్ ఏజెన్సీ మాత్రం భిన్న వాదనలు వినిపిస్తోంది. భారత్ దాడులు జరిపిన బాలకోట్‌లోని భవనాలకు ఎలాంటి నష్టం జరగలేదని ఆ సంస్థ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దానికి సంబంధించిన శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని ఓ సంస్థ తీసిన శాటిలైట్ చిత్రాలను రాయిటర్స్ ఏజెన్సీ బయటకు విడుదల చేసింది. ఆ చిత్రాలను చూస్తే బాల్‌కోట్‌ మీద బాంబులు పడ్డాయని చెప్పడానికి ఎలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదని స్పష్టం చేసింది.

దీంతో భారత్ దాడులపై అందరికీ అనుమానం వచ్చేలా చేసిన ఈ ఏజెన్సీ తాజాగా దాడులు జరిగిన ప్రదేశానికి సంబంధించి మరిన్ని ఫొటోలను రిలీజ్ చేసింది. ఈ ఫొటోలను భారత మిస్సైల్స్ కిందపడ్డ 100మీటర్ల దూరం నుంచి తీసినట్లు చెప్పుకొచ్చింది ఈ ఏజెన్సీ. బాల్‌కోట్ స్థావరాలపై దాడి జరిగిన దాఖలు అక్కడ తమకు అసలు కనిపించలేదని, కొండ మీద ఉన్న చెట్లు సహా అక్కడ భవనం చెక్కుచెదరకుండా ఉన్నాయని తెలిపింది. అంతేకాదు అక్కడి స్థానికులతో కూడా తాము మాట్లాడినట్లు ఆ సంస్థ వెల్లడించింది. భారత్ దాడులు చేసినట్లు చెప్తున్న ఆ మదర్సాను గతేడాదే మూసివేశారని, ఇప్పుడు అక్కడ ఎవరూ లేరని వారు చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. అయితే దాడులు జరిగిన ప్రదేశానికి వెళ్లేందుకు తమకు అనుమతిని ఇవ్వలేదని ఆ ఏజెన్సీ రిపోర్టర్ తెలిపారు.

ఇక భారత్ దాడులపై ఓ పాక్ సైనికుడు మాట్లాడుతూ.. భారత్ 300మందిని చంపాం అంటోంది. కానీ ఇక్కడ ఉన్న 300 చెట్లకు కూడా ఎలాంటి హాని జరగలేదని అన్నారు. దేవుడి దయ వలన భారత్ చేసిన దాడుల్లో బాలకోట్‌లో నివాసం ఉంటోన్న ఐదారు కుటుంబాలకు ఎలాంటి నష్టం జరగలేదని ఆ సైనికుడు చెప్పుకొచ్చినట్లు రాయిటర్స్ పేర్కొంది.

అయితే పుల్వామాలో 42మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిని ఖండిస్తూ ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాక్ ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఇందులో 300మంది ఉగ్రవాదులు మరణించినట్లు కొందరు చెబుతున్నా.. ఇరు దేశ ప్రభుత్వాల నుంచి మాత్రం అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ క్రమంలో విడులైన శాటిలైట్ ఫొటోలు ఘటనపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మరోవైపు శాటిలైట్ ఫొటోలపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో దాడులు జరిగాయా..? జరిగితే ఎంతమంది మరణించారు..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో