
పర్యావరణం బాగుంటేనే జీవకోటి మనుగడ ఉంటుంది.. జీవవైవిధ్యంతోనే జీవరాశుల మనుగడ.. ఇలా పేనవేసుకున్న విశాల విశ్వంలో భూమిపై ఉన్న ప్రకృతి మాత్రమే జీవకోటికి అవసరమైన ప్రాణవాయువు, ఆహారం, నీరు అందిస్తుంది. వాస్తవానికి ప్రకృతితో పక్షులు ఎక్కువగా మమకమై ఉంటాయి.. అందుకే.. వీటిని పర్యావరణ జీవరాశులు అంటారు.. పక్షులు జీవవైవిధ్యానికి సూచికలు.. ఎందుకంటే అవి ప్రపంచ జీవ వైవిధ్యంలో అంతర్భాగంగా ఉన్నాయి. ప్రపంచంలోని 10,000 పక్షి జాతులలో దాదాపు సగం అడవులు, చిత్తడి నేలలు.. గడ్డి భూములపై ఆధారపడి జీవిస్తున్నాయి.. అందుకే.. ప్రపంచంలోని అన్ని పర్యావరణ వ్యవస్థల నివాసులుగా పక్షుజాతులను పేర్కొంటారు. విస్తృత జీవవైవిధ్యం, వాతావరణ మార్పుల కోసం వాటిని కొన్ని ఉత్తమ సూచికలుగా చెప్పవచ్చు.. భూమిపై ప్రకృతి తల్లి సృష్టించిన అపారమైన వైవిధ్యానికి పక్షి జాతులు అద్భుతమైన ఉదాహరణ అని.. అవి పర్యావరణ వ్యవస్థను కాపాడుతాయని ఇప్పటికే.. ఎన్నో అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే.. ప్రస్తుత ఆధునిక యుగంలో పక్షులు ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి.. అడవలను నరకడం, పారిశ్రామిక విప్లవం.. ఆధునిక టెక్నాలజీ.. విధ్వసం, ప్రకృతి వైపరిత్యాలు.. ఇలా భూవిపై జరిగే అనేక రకాల కారణాల వల్ల చాలా వరకు పక్షి జాతులు అంతరించిపోయాయి.. మరికొన్ని అంతరిస్తున్నాయి. ముఖ్యంగా వాటి నివాస ప్రాంతాలను భంగం కలిగించడం వల్ల పక్షుల సంరక్షణపై ప్రభావం చూపుతుందని.. వాటి మనుగడతోనే జీవవైవిధ్యం సాధ్యమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.. వాస్తవానికి పక్షులు కాలానుగుణంగా ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి.. వాటికి అనువైన ప్రదేశాలకు...