AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ప్యాసింజర్ రైలులో 24 కోచ్‌లే ఎందుకు ఉంటాయి.? కారణం ఏంటంటే..

ప్రయాణికులు మొదలు, గూడ్స్‌ వరకు ఎన్నో సేవలను ఇండియన్‌ రైల్వేస్‌ అందిస్తున్నాయి. ఇక ఇంత పెద్ద నెట్‌వర్క్‌ కలిగిన ఇండియన్‌ రైల్వేస్‌లో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఇలాంటి ఆసక్తికరమైన అంశాల్లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఏ ప్యాసింజర్‌ రైలును చూసినా అందులో 24 కోచ్‌లు మాత్రమే ఉంటాయి. మరి ప్యాసింజర్‌ రైలులో కోచ్‌లు 24 ఎందుకు ఉంటాయని ఎప్పుడైనాఆలోచించారా.?

Indian Railways: ప్యాసింజర్ రైలులో 24 కోచ్‌లే ఎందుకు ఉంటాయి.? కారణం ఏంటంటే..
Indian Railways
Narender Vaitla
|

Updated on: Dec 17, 2023 | 4:00 PM

Share

ఎన్నో ఆసక్తికరమైన విషయాలకు ఇండియన్‌ రైల్వే పెట్టింది పేరు. ప్రపంచంలో అతిపెద్ద ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థల్లో ఒకటైన ఇండియన్ రైల్వే ద్వారా ప్రతీ రోజూ లక్షల సంఖ్యలో ప్రయాణికులు తమ గమ్య స్థానాలను చేరుకుంటున్నారు. కోట్లాది రూపాయాల లావేదేవీలు జరుగుతున్నాయి.

ప్రయాణికులు మొదలు, గూడ్స్‌ వరకు ఎన్నో సేవలను ఇండియన్‌ రైల్వేస్‌ అందిస్తున్నాయి. ఇక ఇంత పెద్ద నెట్‌వర్క్‌ కలిగిన ఇండియన్‌ రైల్వేస్‌లో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఇలాంటి ఆసక్తికరమైన అంశాల్లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఏ ప్యాసింజర్‌ రైలును చూసినా అందులో 24 కోచ్‌లు మాత్రమే ఉంటాయి. మరి ప్యాసింజర్‌ రైలులో కోచ్‌లు 24 ఎందుకు ఉంటాయని ఎప్పుడైనాఆలోచించారా.? దీని వెనకాల ఉన్న అసలు రీజన్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు వాటిలో ఒక రైలు కచ్చితంగా కొద్దిసేపు మరో ట్రాక్‌పై ఆగాల్సి ఉంటుంది. వేగంగా వెళ్లే రైలు దాటి వెళ్లిన తర్వాత మరొక రైలుకు మార్గం ఇస్తారు. అప్పటి వరకు మొదటి రైలు వేచి ఉండే ట్రాక్‌ను లూప్‌ లైన్‌గా పిలుస్తారు. ఏ ప్యాసింజర్‌ రైలు అయిన లూప్‌ లైన్‌ కంటే పెద్దగా ఉండకుండదు. ఒకవేళ లూప్‌ లైన్‌ దాటి రైలు కోచ్‌లు బయటకు వస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్యాసింజర్‌ రైలులో 24 కంటే ఎక్కువ కోచ్‌లు ఉండవు.

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వేగంగా వెళ్తాయి కాబట్టి అవి క్రాస్‌ చేసేంత సేపు ప్యాసింజర్‌ రైళ్లను లూప్‌ లైన్‌లో ఉంచుతారు. రైల్వే నిబంధనల ప్రకారం లూప్‌ లైన్‌ పొడవు 650 నుంచి 750 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది సరిగ్గా 24 కోచ్‌లకు సరిపోతుంది. ఇక రైలులోని అన్ని కోచ్‌లు ప్లాట్‌ ఫామ్‌పై సులభంగా చేరుకోవడానికి వీలుగా ప్లాట్‌ఫామ్‌ కంటే రైలు పొడవు ఉండకూడదు. అందుకే రైలుకు 24 కోచ్‌లను ఏర్పాటు చేస్తారు. ఇండియన్‌ రైల్వేలో సగటు కోచ్ పొడవు దాదాపు 25 మీటర్లు, దీని కారణంగా గరిష్టంగా 24 కోచ్‌లు, ఒక ఇంజన్ మొత్తం 650 మీటర్లలో ప్లాట్‌ఫామ్‌పై రైలు ఆగుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..