Pollution: వామ్మో ఏడాదికి 24 లక్షల మందిని చంపుతుందా.. చాలా నగరాల్లో దారుణ పరిస్థితులు..!

Pollution: ది లాన్సెట్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. వాయు కాలుష్యం వల్ల సంభవించే మరణాలలో భారతదేశం, చైనాలు అగ్రస్థానంలో ఉన్నాయి.

Pollution: వామ్మో ఏడాదికి 24 లక్షల మందిని చంపుతుందా.. చాలా నగరాల్లో దారుణ పరిస్థితులు..!
Pollution

Updated on: May 19, 2022 | 7:27 PM

Pollution: ది లాన్సెట్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. వాయు కాలుష్యం వల్ల సంభవించే మరణాలలో భారతదేశం, చైనాలు అగ్రస్థానంలో ఉన్నాయి. కాలుష్యం కారణంగా ఇండియాలో ఏటా దాదాపు 24 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. చైనాలో ఈ సంఖ్య 22 లక్షలుగా నమోదైంది. ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కారణంగా ప్రతి సంవత్సరం 9 మిలియన్ల మంది మరణిస్తున్నారు. అదే సమయంలో 2000 సంవత్సరం తర్వాత కార్లు, ట్రక్కులు, పరిశ్రమల నుంచి వచ్చే పొగ కారణంగా మరణాలు దాదాపు 55 శాతం పెరిగాయి. అయితే కట్టెల పొయ్యిల నుంచి వచ్చే పొగ, జంతువుల వ్యర్థాల వల్ల కలిగే కాలుష్యం కారణంగా తక్కువ మరణాలు నమోదయ్యాయి.

చాలా నగరాల్లో గాలి నాణ్యత తక్కువగా ఉంది

భారతదేశంలో గాలి నాణ్యత గురించి మాట్లాడినట్లయితే చాలా నగరాల్లో గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉంది. గత మార్చి-ఏప్రిల్ గురించి చెప్పాలంటే జాతీయ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 201 నుంచి 215 వరకు ఉంది. 201 నుంచి 300 మధ్య ఉన్న AQI చాలా చెడ్డ స్థాయిగా పరిగణిస్తారు. మనం ఈ గాలిని ఎక్కువసేపు పీల్చుకుంటూ ఉంటే శరీరం లోపల అన్ని రకాల దుష్ప్రభావాలు సంభవిస్తాయి. కానీ అది జరగడానికి చాలా సమయం పడుతుంది. నిరంతరం చెడు గాలి పీల్చడం వల్ల క్యాన్సర్, గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వ్యాధులు, వాయు కాలుష్యం మధ్య సంబంధాలపై మరిన్ని అధ్యయనాలు చేయడం అవసరం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us