Health News: గోళ్లు, కళ్లు పసుపు రంగులో ఉన్నాయా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..

|

Nov 18, 2021 | 10:21 PM

Health News: శరీరంలో బిలిరుబిన్ స్థాయి పెరిగినప్పుడు కామెర్లు వస్తాయి. కామెర్లు కాలేయాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. దీని వల్ల కాలేయం సరిగా పనిచేయదు. అటువంటి పరిస్థితిలో

Health News: గోళ్లు, కళ్లు పసుపు రంగులో ఉన్నాయా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..
Jaundice
Follow us on

Health News: శరీరంలో బిలిరుబిన్ స్థాయి పెరిగినప్పుడు కామెర్లు వస్తాయి. కామెర్లు కాలేయాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. దీని వల్ల కాలేయం సరిగా పనిచేయదు. అటువంటి పరిస్థితిలో, బిలిరుబిన్ క్రమంగా శరీరం అంతటా వ్యాపిస్తుంది. తద్వారా శరీరంలో రక్తం సరఫరా తగ్గిపోవడంతో చర్మం, గోళ్లు, కళ్లు పసుపు రంగులోకి మారుతాయి. కామెర్లను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే.. సులభంగా తగ్గించవచ్చు. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా.. సమస్య తీవ్రమవుతుంది. కావున.. కామెర్ల లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవే ప్రధాన కారణాలు..
కలుషితమైన ఆహారం, వైరల్ ఇన్‌ఫెక్షన్, ఆల్కహాల్, బ్లడ్ ఇన్‌ఫెక్షన్, హెపటైటిస్ బి, సి వైరస్ ఇన్‌ఫెక్షన్, పిత్త వాహికలో గడ్డ, క్యాన్సర్, అధికంగా మందుల వినియోగం, అశుద్ధమైన రక్తాన్ని ఎక్కించడం వల్ల కూడా కామెర్లు వస్తాయి.

అలాంటి వారిలో బిలిరుబిన్ శాతం పెరుగుతుంది..
ఎర్ర రక్త కణాలలో బిలిరుబిన్ కనిపిస్తుంది. శరీరంలో ఎప్పటికప్పుడు ఎర్రరక్తకణాలు తయారై చనిపోతాయి. చనిపోయిన కణాలను కాలేయం ఫిల్టర్ చేస్తుంది. చనిపోయిన కణాలను ఫిల్టర్ చేయలేని స్థితిలో కాలేయం ఉన్నప్పుడు.. రక్తంలో బిలిరుబిన్ పరిమాణం పెరగడం ప్రారంభం అవుతుంది. ఇదికాస్తా శరీరంలోని ఇతర భాగాలకు చేరుకుంటుంది. ఫలితంగా శరీరంలోని అన్ని భాగాలు పసుపు రంగులో కనిపిస్తాయి. దీనినే కామెర్లు అని అంటారు. రక్త పరీక్ష ద్వారా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.

కామెర్లు తేలడానికి ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి..
కళ్లు, గోళ్లు, చర్మం, మూత్రం తదితరాలు పసుపు రంగులోకి మారడం, ఆకలి లేకపోవడం, వికారం, ఏమీ తినాలని అనిపించకపోవడం, కడుపునొప్పి, అలసట, బరువు తగ్గడం, తొలిదశలో వైరల్ ఫీవర్ సమస్య కూడా చాలాసార్లు వస్తుంది.

ఇలా జాగ్రత్తపడండి..
పై లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తగు జాగ్రత్తలు పాటించండి.
కలుషితమైన ఆహారం, వైన్, ఇతర హానీకరమైన పదార్థాలను తినడం మానుకోండి.
డాక్టర్ సూచనలను అనుసరించి మందులను సమయానిక వేసుకోండి.
వేడి చేసిన నీటిని మాత్రమే తాగండి.
స్పైసీ ఫుడ్స్ మానుకోండి.
ఆహారం తినే సమయంలో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

Also read:

Balakrishna: బాలకృష్ణ-గోపిచంద్ మలినేని సినిమా పై సరికొత్త గాసిప్.. అదెంటంటే..

India vs Pakistan: భారత్-పాకిస్థాన్ క్రికెట్‌పై పీసీబీ ఛీఫ్ కీలక వ్యాఖ్యలు.. ట్రై సిరీస్‌లు ఆడదామంటూ బీసీసీఐకి ఆఫర్..!

Digilocker: మీ ఫోన్‌లో ఈ ఒక్క యాప్‌ ఉంటే చాలు.. అన్ని డాక్యుమెంట్లు భద్రంగా దాచుకోవచ్చు..!