
బంగాళదుంప ముక్కలు: కళ్లను చల్లబరచడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. దీని కోసం.. ముందుగా బంగాళాదుంపలను సన్నని ముక్కలుగా కట్ చేసి.. వాటిని కళ్లపై ఉంచుకోండి.. ఇలా అరగంట తర్వాత వాటిని తొలగించండి.


పచ్చి కూరగాయలను ఎక్కువగా తినండి: కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చి కూరగాయలు తీసుకోవాలి. వైద్యులు కూడా సిఫార్సు చేస్తున్నారు. నిజానికి కూరగాయల్లో ఉండే ల్యూటిన్ కంటి సమస్యలను దూరం చేస్తుంది.

ఉప్పు: కళ్లలో మంట కారణంగా వాటి నుంచి నీరు నిరంతరం దారాగా కారుతూ ఉంటుంది. దీని కోసం, ముందుగా నీటిలో ఉప్పు కలపండి.. ఆ నీటిలో ఒక గుడ్డను ముంచి కళ్లపై ఉంచండి. కొంత సమయం తర్వాత సాధారణ నీటితో కళ్లను కడగితే సరి.

నీళ్లతో కడుక్కోవాలి: కళ్లలో నీటి సమస్య ఉన్నప్పుడల్లా.. ఈ సమయంలో చల్లని నీటితో కళ్లను కడగాలి. దీంతో కళ్లలో ఉండే మురికి కూడా తొలగిపోతుంది. కొన్నిసార్లు ఈ ధూళి కళ్ళలో చికాకును కలిగిస్తుంది.. ఇది తరువాత నీరు వస్తుంటుంది. దీనికి నిత్యం చల్లని నీటితో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.