
వైద్య నిపుణుల విశ్లేషణల ప్రకారం.. పీచుపదార్థం అస్సలు లేని జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకునే ఆహార పదార్థాలను నిరంతరం తీసుకోవడం వల్లే మలద్వారం వద్ద ఉండే రక్తనాళాలపై తీవ్రమైన ఒత్తిడి పడి అవి వాపునకు గురవుతాయి. దీనివల్ల ఫైల్స్ ముప్పు పెరుగుతుంది. మరి కాలేయం, పేగులను పాడుచేసి పైల్స్ సమస్యను పెంచే ఆ ప్రమాదకరమైన ఆహారాలు ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం.
ఫైల్స్ సమస్యను తీవ్రం చేసే ఆ 5 ప్రధాన ఆహారాలు ఇవే:
1. మైదా మరియు బేకరీ ఫుడ్స్
మైదాతో తయారు చేసిన పరోటాలు, బ్రెడ్, పిజ్జా, బర్గర్, బిస్కెట్లు మరియు కేకులు వంటి పదార్థాలలో ఫైబర్ శాతం సున్నాగా ఉంటుంది. ఇవి పేగుల్లోకి వెళ్లినప్పుడు చాలా జిగటగా మారి, జీర్ణవ్యవస్థను స్తంభింపజేస్తాయి. ఫలితంగా మలం విపరీతంగా గట్టిపడి, విసర్జన సమయంలో తీవ్రమైన ఒత్తిడి కలిగించి పైల్స్ సమస్యకు కారణమవుతాయి.
2. అతిగా మసాలాలు, కారం ఉన్న వంటకాలు
తీవ్రమైన కారం, గరం మసాలాలు ఎక్కువగా ఉండే ఫాస్ట్ ఫుడ్స్, బిర్యానీలు మరియు నిల్వ పచ్చళ్లు పైల్స్ ఉన్నవారికి శత్రువులనే చెప్పాలి. ఇవి నేరుగా పైల్స్ కలిగించకపోయినా, జీర్ణవ్యవస్థను దెబ్బతీసి.. మల విసర్జన సమయంలో మలద్వారం వద్ద విపరీతమైన మంట, నొప్పి మరియు రక్తస్రావం అయ్యేలా చేస్తాయి.
3. వేపుళ్లు మరియు జంక్ ఫుడ్స్
ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, చిప్స్ వంటి నూనెలో బాగా వేయించిన పదార్థాలలో అన్-శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి కడుపులో చాలా సమయం పడుతుంది. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ పెరగడమే కాకుండా మలబద్ధకం సమస్య మరింత జటిలంగా మారుతుంది.
4. రెడ్ మీట్ (రక్తమాంసం/మటన్):
మటన్, పోర్క్ లేదా ప్రాసెస్ చేసిన మాంసంలో ప్రొటీన్లు, కొవ్వులు చాలా దట్టంగా ఉంటాయి. కానీ వీటిలో పీచుపదార్థం అస్సలు ఉండదు. వీటిని ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియ మందగించి, మల విసర్జన కష్టతరంగా మారుతుంది. పైల్స్ లక్షణాలు ఉన్నవారు రెడ్ మీట్కు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
5. కెఫిన్ మద్యపానం
అతిగా టీ, కాఫీలు తాగడం లేదా మద్యం సేవించడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ (నీటి శాతం తగ్గిపోవడం) ఏర్పడుతుంది. శరీరం నిర్జలీకరణకు గురైనప్పుడు పేగులలోని తేమను శరీరం లాగేసుకుంటుంది, దీనివల్ల మలం గట్టిపడి పైల్స్ తీవ్రతను పెంచుతుంది.
పైల్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?:
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం: మీ డైట్లో ఆకుకూరలు, తాజా పండ్లు, కూరగాయలు, మరియు తృణధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.
పుష్కలంగా నీరు తాగడం: రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగడం వల్ల మలం సాఫ్ట్గా మారి విసర్జన సులువవుతుంది.
శారీరక శ్రమ: నిరంతరం ఒకే చోట కూర్చుని ఉండకుండా గంటకోసారి లేచి నడవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల పేగుల కదలికలు మెరుగవుతాయి.
గమనిక :
ఇది కేవలం సమాచారం మాత్రమే. పైన పేర్కొన్న వివరాలు అంతర్జాతీయ వైద్య నిపుణుల నివేదికలు, గ్యాస్ట్రోఎంటరాలజీ అధ్యయనాలు మరియు ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా అందించబడ్డాయి. పైల్స్ సమస్య ప్రారంభ దశలోనే ఉన్నా లేదా తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కనిపిస్తున్నా ఆలస్యం చేయకుండా తక్షణమే అర్హత కలిగిన వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. దీనికి సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు.