శుభవార్త.. కరోనా మందు మరింత తక్కువ ధరకే..
ప్రజలకు మరింత తక్కువ ధరకు మందు అందేలా గ్లెన్మార్క్ సంస్థ శుభవార్త చెప్పలింది. యాంటీవైరల్ డ్రగ్ ఫావిపిరవిర్ ధరను ఏకంగా 27 శాతం తగ్గించింది. ఫాబిఫ్లూ టాబ్లెట్ ధరను తగ్గించి తక్కువ రేటుకే ఇస్తుంది. సోమవారం నుంచి రూ.75లకు అందిస్తున్నట్టు...
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ టెర్రర్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. సామాన్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, వైద్యులు, పోలీసు సిబ్బంది, ప్రముఖ నటులు కూడా ఈ వైరస్ బారిన పడటంతో.. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఈ తరణంలో ప్రజలకు మరింత తక్కువ ధరకు కరోనా మందు అందేలా గ్లెన్మార్క్ సంస్థ శుభవార్త చెప్పింది. యాంటీవైరల్ డ్రగ్ ఫావిపిరవిర్ ధరను ఏకంగా 27 శాతం తగ్గించింది. ఫాబిఫ్లూ టాబ్లెట్ ధరను తగ్గించి తక్కువ రేటుకే ఇస్తుంది. ఎమ్మార్పీపై ఒక టాబ్లెట్ 75 రూపాయలుగా ఉంటుందని తెలిపింది. సోమవారం నుంచి రూ.75లకు అందిస్తున్నట్టు గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ పేర్కొంది. కాగా గత నెలలో ఒక టాబ్లెట్ను 103 రూపాయల చొప్పున విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇతర దేశాలలో ఫావిపిరవిర్ ఖర్చుతో పోల్చితే ఇండియాలో ఫాబిఫ్లూను అతి తక్కువ మార్కెట్ ఖర్చుతో ప్రారంభించామన్నారు. ఇప్పుడు భారత్లో తయారు కావడం, అధిక ఉత్పత్తి కారణంగా తక్కువ రేటుకే ఈ టాబ్లెట్లను అందుబాటులోకి తెచ్చామని భారత్ బీజీఎస్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ మాలిక్ వెల్లడించారు. తక్కువ ధర చేయడం కారణంగా.. ఈ మాత్రలు కరోనా రోగులకు మరింత చేరువవుతాయని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Read More: బ్రేకింగ్: సీబీఎస్ఈ 12వ తరగతి రిజల్ట్స్ రిలీజ్..