FEATURED:

Cancer Awareness: క్యాన్సర్ పై MSD ఫార్మాస్యూటికల్స్ అవగాహనా కార్యక్రమం

భారతదేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో MSD ఫార్మాస్యూటికల్స్, TV9 తో కలిసి క్యాన్సర్ అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించింది. నిపుణులు క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు, స్క్రీనింగ్ ప్రాముఖ్యత, శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్, ఇమ్యునోథెరపీ వంటి అధునాతన చికిత్స తదితర అంశాలపై చర్చించారు. ఆన్‌లైన్‌ ద్వారా సొంత వైద్యం ప్రమాదాలను వివరించి, వైద్యులపై నమ్మకం, ఆరోగ్య బీమా అవసరాన్ని నొక్కిచెప్పారు.

Updated on: Jun 29, 2026 | 1:11 PM

MSD ఫార్మాస్యూటికల్స్, TV9 తెలుగుతో కలిసి క్యాన్సర్ అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో ప్రముఖ ఆంకాలజిస్టులు డాక్టర్ వంశీ కృష్ణ రెడ్డి (యశోద హాస్పిటల్స్), డాక్టర్ వింధ్య వాసిని (ఒమేగా హాస్పిటల్స్), డాక్టర్ సంతోష్ కుమార్ (స్టార్ హాస్పిటల్స్), డాక్టర్ సంపత్ వెంకట్ (అపోలో హాస్పిటల్స్) పాల్గొన్నారు. భారతదేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ICMR 2022 అధ్యయనం వెల్లడించింది. ప్రారంభ దశలో క్యాన్సర్‌ను గుర్తించడం ఎంత ముఖ్యమో డాక్టర్లు నొక్కిచెప్పారు. ప్రేగు, మూత్రాశయ అలవాట్లలో మార్పులు, మానని పుండ్లు, అసాధారణ రక్తస్రావం, శరీరంలో గడ్డలు వంటి లక్షణాలను వెంటనే గుర్తించి వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. మామోగ్రామ్, ప్యాప్ స్మియర్, కొలనోస్కోపీ వంటి స్క్రీనింగ్ పరీక్షల ప్రాముఖ్యతను వివరించారు. అలాగే, శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్‌తో పాటు ఇమ్యునోథెరపీ వంటి అధునాతన చికిత్సలు భారతదేశంలో అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఇమ్యునోథెరపీ రోగనిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తుందని తెలిపారు. కీమోథెరపీ, ఇమ్యునోథెరపీల మధ్య ఉన్న తేడాలు, వాటి అపోహలను నివృత్తి చేశారు. క్యాన్సర్ చికిత్సలో వైద్యుల సలహా, ఆరోగ్య బీమా ఆవశ్యకతను డాక్టర్లు ఉద్ఘాటించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.