వేసవి వేడిలో ప్రజలు ఆరోగ్యంగా, చురుకుగా ఉండేందుకు eRZL ఒక విస్తృత హైడ్రేషన్ అవగాహన కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో చేపట్టింది. ఇందులో భాగంగా గుంటూరులో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోజువారీ పనులు చేసేటప్పుడు, ముఖ్యంగా అధిక ఎండల్లో ప్రజలు డీహైడ్రేషన్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. వేడిగా ఉన్నప్పుడు శరీరం కేవలం నీటిని మాత్రమే కాకుండా, కీలకమైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతుంది. దీనివలన అలసట, నీరసం వచ్చి, డీహైడ్రేషన్ సమస్యలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో eRZL బృందం గుంటూరులోని వివిధ ప్రాంతాలలో క్షేత్రస్థాయి శాంప్లింగ్ కార్యక్రమాలను నిర్వహించింది. ఈ ప్రచారం ద్వారా వినియోగదారులు తమ సుదీర్ఘమైన పని దినాలలో, అలాగే అలసటతో కూడిన సమయాలలో ఎలక్ట్రోలైట్లను తిరిగి శరీరంలో భర్తీ చేయడం ఎంత అవసరమో అర్థం చేసుకున్నారు. eRZL డ్రింక్స్ను నేరుగా రుచి చూసిన ప్రజలు, దాని ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. గుంటూరులో ఈ అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.