అవన్నీ వట్టి పుకార్లే.. ఖండించిన ‘ఆదిపురుష్’ టీమ్‌

| Edited By:

Sep 09, 2020 | 5:52 PM

రెబల్‌స్టార్ ప్రభాస్‌తో ఓమ్‌ రౌత్ తెరకెక్కిస్తోన్న పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్'‌. రామాయణం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీని 3డీలో

అవన్నీ వట్టి పుకార్లే.. ఖండించిన ఆదిపురుష్ టీమ్‌
Follow us on

Prabhas Adipurush Movie: రెబల్‌స్టార్ ప్రభాస్‌తో ఓమ్‌ రౌత్ తెరకెక్కిస్తోన్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’‌. రామాయణం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీని 3డీలో భారీ బడ్జెట్‌తో టీ సిరీస్ నిర్మిస్తోంది. ఇక ఇందులో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో సీత పాత్రకు గానూ మాజీ మిస్ ఇండియా ఊర్వశి రౌటెలాను సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. సీత పాత్రకు ఆమె బాగా సరిపోతుందని భావించిన దర్శకుడు ఊర్వశితో మాట్లాడుతున్నట్లు టాక్ నడిచింది. ఈ పుకారు కాస్త వైరల్‌గా మారి, చిత్ర యూనిట్‌ వద్దకు వెళ్లింది. దీంతో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

”రాముడిగా ప్రభాస్‌ని, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్‌ని మాత్రమే మేము ఫైనల్‌ చేశాము. మిగిలిన పాత్రాధారులకు సంబంధించిన సంప్రదింపులు జరుగుతున్నాయి. ఊర్వశిని మేము సంప్రదించ లేదు” అని నిర్మాతలు ఓ ప్రకటనను విడుదల చేశారు. కాగా తెలుగు, హిందీలో తెరకెక్కిస్తోన్న ఈ మూవీని పలు భాషల్లో విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read More:

‘ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి’ స్కాంలో కొనసాగుతున్న విచారణ.. 30కోట్లు రికవరీ

‘నగదు బదిలీ పథకం’పై అజయ్‌ కల్లాం క్లారిటీ.. ఏపీ రైతులకు భరోసా