‘అర్జున్రెడ్డి’ సినిమాతో సెన్సేషనల్ స్టార్గా ఎదిగిన విజయ్ దేవరకొండ ఇతర భాషల్లోనూ తన మార్కెట్ను విస్తరించుకునే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నోటా సినిమాతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఆశించిన ఫలితం సాధించలేకపోయాడు. ఇదిలా ఉంటే తాజాగా తమిళ్లో మరో ప్రాజెక్ట్కు విజయ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాత ఎస్ఆర్ ప్రభు, కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఓ మూవీని నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటించనున్నాడట. ఇక ఇందులో విజయ్ సరసన లేడి సూపర్స్టార్ నయనతార హీరోయిన్గా నటించనుందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ఇటీవల డియర్ కామ్రేడ్ షూటింగ్ను పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ.. త్వరలో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నాడు.