Tollywood : ఉమ్మడి నల్లగొండ జిల్లా దర్శకులకు ‘ఫాల్కే’ అవార్డు..

తెలుగు చిత్ర సీమలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కత్తి కాంతారావు, ప్రభాకర్ రెడ్డి వంటి తారలు ఎందరో మెరిశారు. ప్రస్తుతం కూడా ఎంతోమంది కళాకారులు పలు రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు సినీ దర్శకులు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు.

Tollywood : ఉమ్మడి నల్లగొండ జిల్లా దర్శకులకు ఫాల్కే అవార్డు..
Tollywood

Edited By:

Updated on: May 04, 2025 | 6:07 PM

తెలుగు చిత్ర సీమలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కత్తి కాంతారావు, ప్రభాకర్ రెడ్డి వంటి తారలు ఎందరో మెరిశారు. ప్రస్తుతం కూడా ఎంతోమంది కళాకారులు పలు రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు సినీ దర్శకులు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు.

ఇది కూడా చదవండి :థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఆ అమ్మడి స్పెషల్ సాంగ్..

ఇటీవల కాలంలో తెలుగు చిత్ర సీమలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన  కళాకారులు రాణిస్తున్నారు. 24 క్రాఫ్ట్ లలో తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన యాట సత్యనారాయణ దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. తెలంగాణలో జరిగిన రజాకార్ల దుశ్చర్యలపై, సాయుధ రైతాంగ గెరిల్లా పోరాటంపై రూపొందిన చిత్రానికి యాట సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను భువనగిరి చెందిన బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. మొదటి సారి దర్శకత్వం వహించిన వారి కేటగిరీలో యాట సత్యనారాయణ ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు.

ఇది కూడా చదవండి : ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఆమె ఎవరంటే

యాదాద్రి జిల్లా భూదాన్‌ పోచంపల్లికి చెందిన బడుగు విజయ్‌కుమార్‌ కూడా అవార్డు దక్కింది. స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా భూదాన్‌ పోచంపల్లికి చెందిన యువ దర్శకుడు బడుగు విజయ్‌కుమార్‌ ‘యూనిటీ ది మ్యాన్‌ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌’ డాక్యుమెంటరీ చిత్రానికి ఉత్తమ దర్శకుడి కేటగిరీలో దాదాసాహెబ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. ఢిల్లీలో జరిగిన దాదా సాహెబ్‌ ఫాల్కే15వ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో 200 చిత్రాలను ప్రదర్శించగా 25 చిత్రాలు వివిధ కేటగిరీలలో అవార్డుకు ఎంపికయ్యాయి. అందులో ఉత్తమ దర్శకులుగా యాట సత్యనారాయణ, బడుగు విజయ్‌కుమార్‌ ఎంపికయ్యారు. ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో యాట సత్యనారాయణ, బడుగు విజయ్‌కుమార్‌ అందుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి