టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ యాంకర్ ఎవరంటే వెంటనే తడుముకోకుండా చెప్పే పేరు అనసూయ. యస్.. ప్రొఫిషన్ పరంగా కెరీర్ పీక్ స్టేజ్లో ఉంది అనసూయ. ఒక పక్క నటిగా మరో పక్క యాంకర్గా దుమ్ములేపుతోంది. జబర్దస్త్ కామెడీ ప్రోగ్రామ్కు క్రేజ్ రావడంలో తనవంతు పాత్ర పోషించింది. వయసు 40 ఏళ్లకు దగ్గరుపడుతున్నా కూడా చెక్కుచెదరని గ్లామర్తో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. సోగ్గాడే చిన్నినాయనా, క్షణం చిత్రాల్లో మంచి పాత్రల్లో మెరిసింది. రంగస్థలంలో రంగమత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పుష్ప సినిమాలో ‘దాక్షాయని’ పాత్రలో మంగళం శ్రీను భార్యగా ఆకట్టుకుంది. కాగా ఇటీవలే అనసూయ తండ్రి సుదర్శన్ రావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఇది ఆమె పర్సనల్ లైఫ్కు పెద్ద కుదుపుగానే చెప్పాలి. ప్రజంట్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీతో పాటు కిలాడీ, పక్కా కమర్షియల్, రంగ మార్తాండ సినిమాల్లో కూడా నటిస్తోంది. భీష్మపర్వం సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది.
కాగా తాజాగా 2021 ఎండ్ అవుతోన్న నేపథ్యంలో ఇన్స్టా ఖాతాలో ఓ వీడియోను పంచుకుంది. ఈ ఏడాది 12 నెలల కాలంలో తన జీవితంలోని పలు సందర్భాలను రివైండ్ చేసుకుంది. ఈ వీడియోను నెటిజన్లు లైక్ చేస్తున్నారు. నెక్ట్స్ ఇయర్ అంతా తనకు హ్యపీగా ఉండాలని అను ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు.
Also Read: ఇదెక్కడి మాస్రా మామ..! పుష్ప సాంగ్పై మీమ్ చూసి పిచ్చిపిచ్చిగా నవ్విన సమంత
కారులో దర్జాగా వచ్చి ఇతగాడు ఏం దొంగతనం చేశాడో తెలిస్తే కంగుతింటారు