
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ఆ పేరు చెప్తేనే ఫ్యాన్స్ పూనకాలతో ఉగిపోతుంటారు.. స్క్రీన్ మీద తారక్ కనిపిస్తే థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. నటనలో, డాన్స్ లో, డైలాగ్ డెలివరీలో తారక్ నెక్స్ట్ లెవల్ అంతే.. ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ కానీ వారు ఉండరు. సినీ సెలబ్రెటీలు కూడా చాలా మంది ఆయనకు ఫ్యాన్స్.. సినీ సెలబ్రేటీలు చాలా మంది తారక్ అంటే ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పారు. సీనియర్ నటుల నుంచి అప్ కమింగ్ యాక్టర్స్ వరకు చాలా మంది తారక్ ను అభిమానిస్తుంటారు. ఇక తారక్ గురించి చాలా మంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఆయన అందరితో ఎంత స్నేహంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద హీరో అనే గర్వం ఎక్కడా చూపించరు ఎన్టీఆర్. చిన్న చిన్న ఆర్టిస్ట్ లతో కూడా ఎంతో కలివిడిగా మాట్లాడుతుంటాడు ఎన్టీఆర్. ఇటీవలే వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్.. ఇప్పుడు డ్రాగన్, దేవర 2 సినిమాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గురించి సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. తారక్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ పంచుకున్నారు. ఎన్టీఆర్తో కలిసి రాజేంద్రప్రసాద్ నాన్నకు ప్రేమతో సినిమా చేశారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ తండ్రిగా నటించారు. ఈ సినిమా కు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈసినిమా ప్రమోషన్స్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో..రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ..
“తారక్ ఎవరు..? పెద్దాయన మనవడు.. అంటే నాకు ఏమవుతాడో అందరికి తెలుసు. ఇంతవరకు ఎక్కడ బయట చెప్పలేదు. నాన్నకు ప్రేమతో సినిమా క్లైమాక్స్లో నేను నవ్వుతూనే చనిపోతాను. ఆ సీన్లో నటిస్తూ ఎన్టీఆర్ నన్ను పట్టుకొని గంటసేపు ఏడ్చాడు. మేము ఎంతో ఎమోషనల్ అయ్యాం. దర్శకుడు కట్ చెప్పినా కూడా తారక్ ఆగలేకపోయాడు. ఎన్టీఆర్ ను మేము ఓదార్చలేకపోయాం. నా వల్ల కాలేదు. అయ్యో నాన్న నేను ఇక్కడే ఉన్నాగా.. అని చెప్పిన కూడా తారక్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎంతో ఎమోషనల్ అయ్యాడు. మేమిద్దరం యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు.. మా రిలేషన్ కూడా అలాంటిదేగా అని అన్నారు రాజేంద్ర ప్రసాద్. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. ఇక తారక్ ప్రస్తుతం తన సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.