కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ మహిళా కమిషన్.. ఏమన్నదంటే

కొండా సురేఖ భేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని చెప్పారు. సమంతను కించపరచాలని అనుకోలేదని సురేఖ వివరణ ఇచ్చారు. సురేఖ క్షమాపణలు చెప్పకపోయి ఉంటే కమిషన్ స్పందించేది. కానీ ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.  

కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ మహిళా కమిషన్.. ఏమన్నదంటే
Konda Surekha

Updated on: Oct 03, 2024 | 1:30 PM

కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించామని తెలంగాణ మహిళా కమిషన్ తెలిపింది. కొండా సురేఖ భేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని చెప్పారు. సమంతను కించపరచాలని అనుకోలేదని సురేఖ వివరణ ఇచ్చారు. సురేఖ క్షమాపణలు చెప్పకపోయి ఉంటే కమిషన్ స్పందించేది. కానీ ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఈ వ్యవహారంలో కమిషన్ పాత్ర అవసరం లేదు. అలాగే నాగార్జున కుటుంబం లీగల్ నోటీసు ఇచ్చే అంశం పూర్తిగా వారి వ్యక్తిగతం అని తెలంగాణ మహిళా కమిషన్ తెలిపింది.

కాగా  సమంతకు కొండా సురేఖ సారీ చెప్పినా  నిరసనలు ఆగడంలేదు. అక్కినేని కుటుంబానికి సపోర్ట్‌గా సెలబ్రిటీల వరుస ట్వీట్‌లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ , నాని , చిరంజీవి, వెంకటేష్, యంగ్ హీరోలు విశ్వక్ సేన్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు, వరుణ్ తేజ్ స్పందించారు.ఆ అలాగే దర్శకులు రామ్ గోపాల్ వర్మ, హరీష్ శంకర్ కూడా దీని పై స్పందించారు. ఇదిలా ఉంటే మంత్రి సురేఖకు లీగల్‌ నోటీసులు పంపనున్నారు అక్కినేని నాగార్జున.

అలాగే వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దని మా అసోసియేషన్ కూడా పేర్కొంది.  బాధపెట్టాలని చూస్తే మౌనంగా ఉండము అంటూ లేఖాస్త్రం సంధించింది మా..   వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలని PCC చీఫ్‌ మహేష్‌గౌడ్‌ అన్నారు.  కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్న మహేష్‌గౌడ్  మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉందని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us