శ్లాపింగ్‌పై రచ్చ..సీన్‌లోకి తాప్సీ

| Edited By: Pardhasaradhi Peri

Jul 16, 2019 | 2:12 PM

ముంబై: ఒక టాలీవుడ్ కల్ట్ మూవీ ‘అర్జున్ రెడి’..ఈ మూవీనే ‘కబీర్ సింగ్’ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. ఈ రెండు మూవీస్‌కి డైరక్టర్ ఒకరే. అతనే సందీప్‌ రెడ్డి వంగా. ఈ న్యూ ఏజ్ ఫిలిమ్స్‌తో అటు నార్త్‌ని, ఇటు సౌత్‌ని షేక్ చేశాడు ఈ యంగ్ డైరక్టర్. అటు కంటెంట్‌తో పాటు కాంట్రవర్సరీలతో కూడా ఎట్ ఏ టైమ్ ట్రావెల్ అవ్వడం సందీప్‌కు ఫస్ట్ నుంచి అలవాటైపోయింది. ఇటీవల ‘కబీర్ సింగ్ ‘ రిలీజవ్వగా […]

శ్లాపింగ్‌పై రచ్చ..సీన్‌లోకి తాప్సీ
Follow us on

ముంబై: ఒక టాలీవుడ్ కల్ట్ మూవీ ‘అర్జున్ రెడి’..ఈ మూవీనే ‘కబీర్ సింగ్’ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. ఈ రెండు మూవీస్‌కి డైరక్టర్ ఒకరే. అతనే సందీప్‌ రెడ్డి వంగా. ఈ న్యూ ఏజ్ ఫిలిమ్స్‌తో అటు నార్త్‌ని, ఇటు సౌత్‌ని షేక్ చేశాడు ఈ యంగ్ డైరక్టర్. అటు కంటెంట్‌తో పాటు కాంట్రవర్సరీలతో కూడా ఎట్ ఏ టైమ్ ట్రావెల్ అవ్వడం సందీప్‌కు ఫస్ట్ నుంచి అలవాటైపోయింది.

ఇటీవల ‘కబీర్ సింగ్ ‘ రిలీజవ్వగా అందులో హీరో, హీరోయిన్స్  షాహిద్‌ కపూర్‌, కియారా అద్వానీ ఒకరిపై ఒకరు చేయిచేసుకుంటారు. ఆ సీన్‌పై కొంతమంది క్రిటిక్స్ పెదవి విరిచారు. దీనిపై క్లారిటీ ఇచ్చే క్రమంలో సందీప్ వంగా ఓ ఇంటర్య్వూలో  మాట్లాడుతూ..‘ఓ యువతితో  ప్రేమలో ఉన్నప్పుడు అందులో చాలా నిజాయతీ ఉంటుంది. ఓ అబ్బాయి తన సొంతం అనుకున్న అమ్మాయిని ముట్టుకోలేనప్పుడు, కొట్టలేనప్పుడు ఆ బంధంలో ఎమోషన్‌ కనిపించదు’ అన్నాడు.

ఈ వ్యాఖ్యలతో తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగింది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు సమంత, చిన్మయి శ్రీపాద, అనసూయ, మంచు లక్ష్మి తదితరులు సందీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కొంతమంది సందీప్‌ను సపోర్ట్ చేయగా..మరికొందరు ఆయనపై నెగటీవ్‌ కామెంట్స్ చేశారు. సందీప్ కూడా తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు. మీడియా తనను తప్పుగా అర్థం చేసుకుందని తెలిపాడు.

వివాదం ముగుస్తుందనుకుంటున్న సమయంలో.. తన కామెంట్‌తో మళ్లీ అగ్గి రాజేసింది హీరోయిన్ తాప్సీ. సోమవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లాలో ఓ వ్యక్తి తన ప్రియురాలిపై అనుమానంతో ఆమె తల పగలగొట్టి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ వార్తకు సంబంధించిన ఓ ఆంగ్ల మీడియా ఆర్టికల్‌ను తాప్సి ట్యాగ్‌ చేస్తూ.. ‘అనుమానంతో తల పగలగొట్టాడా? బహుశా వారిద్దరూ పిచ్చి ప్రేమలో ఉన్నారేమో. తన నిజమైన ప్రేమను నిరూపించుకోవడానికి ఆమెను చంపేశాడేమో’ అంటూ సందీప్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇన్ డైరక్ట్‌గా  కౌంటర్‌ ఇచ్చారు తాప్సి.

దీంతో సందీప్‌ని సపోర్ట్ చేసేవాళ్లు ఒక్కసారిగా తాప్సీపై సోషల్ మీడియా వేదికగా విమర్శల దాడి ప్రారంభించారు. పరిస్థితి మరీ చేయిదాటిపోవడంతో  స్పందించిన తాప్సీ.. ‘వార్నింగ్: చమత్కార ధోరణి  లేని వారు నా ట్వీట్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.

అంతేకాదు తనని విమర్శిస్తున్నవాళ్లు స్కూల్‌కి వెళ్లి.. గేలి చేయడం, చమత్కరించడం మధ్య తేడాను  తెలిసుకోవాలంటూ మరో ట్వీట్ చేసి..ఇంకాస్త ఫైర్ రాజేసింది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.