Allu Arjun: శంకర్‌పల్లిలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సందడి.. తహశీల్దార్‌ ఆఫీసుకు క్యూ కట్టిన అభిమానులు

|

Oct 08, 2021 | 1:21 PM

సినిమా షూటింగ్‌లతో చాలా బిజీగా ఉండే స్టైలిష్‌ స్టార్‌ అ‍ల్లు అర్జున్‌ రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి తమశీల్దార్‌ కార్యాలయంలో కనిపించారు. ఏదైనా సినిమా షూటింగ్ కోసం వచ్చారని అనుకుంటున్నారా..

Allu Arjun: శంకర్‌పల్లిలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సందడి.. తహశీల్దార్‌ ఆఫీసుకు క్యూ కట్టిన అభిమానులు
Allu Arjun
Follow us on

సినిమా షూటింగ్‌లతో చాలా బిజీగా ఉండే స్టైలిష్‌ స్టార్‌ అ‍ల్లు అర్జున్‌ రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి తమశీల్దార్‌ కార్యాలయంలో కనిపించారు. ఏదైనా సినిమా షూటింగ్ కోసం వచ్చారని అనుకుంటున్నారా.. కాదండి బాబు.. శంకర్‌పల్లి మండలంలోని జన్వాడలో బన్నీ రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్‌ నిమిత్తం శుక్రవారం బన్నీ తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్‌ పనులు పూర్తి అయిన తర్వాత ప్రొసీడింగ్‌ ఆర్డర్‌ను శంకర్‌పల్లి తహశీల్దార్‌ సైదులు బన్నీకి అందజేశారు. అయితే ఎమ్మార్వో కార్యాలయానికి బన్నీ వచ్చాడని తెలుసుకున్న ఫ్యాన్స్ ఆయనను చూసేందుకు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు.

అయితే ఎమ్మార్వో కార్యాలయానికి బన్నీ వచ్చాడని తెలుసుకున్న ఫ్యాన్స్ ఆయనను చూసేందుకు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. అ‍ల్లు అర్జున్‌‌తో సెల్ఫీ దిగేందుకు ఎమ్మార్వో సిబ్బందితోపాటు అభిమానులు క్యూ కట్టారు. ఇక రిజిస్ట్రేషన్‌ పూర్తైన వెంటనే ఆయన తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఇదిలావుంటే.. ఇటీవలే.. జూనియర్‌ ఎన్టీఆర్‌ సైతం ఆరు ఎకరాల భూమి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీ కూడా అదే శంకరపల్లి మండలంలో భూమిని కొనుగోలు చేయడం.. అక్కడ పెద్ద చర్చగా మారింది.

ఇవి కూడా చదవండి: Tomato Price: బాబోయ్ కిలో టమాటా ధర ఇంతా.. రైతుల దగ్గర నుంచి రైతు బజార్‌ల వరకు ధరలకు మళ్లీ రెక్కలు

IPL 2021 RCB vs DC Live Streaming: బెంగళూరు వర్సెస్ ముంబై.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా మ్యాచ్‌లు చూడాలో తెలుసా..

Tea History: నిద్రమత్తును వదిలించే చాయ్.. మొదట్లో ఎందుకోసం తయారు చేసేవారో తెలిస్తే షాక్ అవుతారు..

Dosa War: దేశాన్ని రెండుగా విడగొట్టిన దోస.. మాడిపోయిన దోసపై నెట్టింట్లో రచ్చ రచ్చ.. ఏం జరిగిదంటే..