శ‌ర్వానంద్ బైలింగ్యువ‌ల్ మూవీ..ఆ లోటు తీర్చ‌డానికేన‌ట‌..

|

Jun 07, 2020 | 1:31 PM

ప్ర‌స్తుతం శ‌ర్వా 'శ్రీకారం' అనే ఫిల్మ్ చేస్తున్నాడు. వ్య‌వ‌సాయం నేపథ్యంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత శ‌ర్వానంద్ ఓ త‌మిళ నిర్మాత‌తో క‌లిసి ద్వి భాషా చిత్రం చిత్రం చేయ‌నున్న‌ట్టు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో టాక్ న‌డుస్తోంది.

శ‌ర్వానంద్ బైలింగ్యువ‌ల్ మూవీ..ఆ లోటు తీర్చ‌డానికేన‌ట‌..
Follow us on

క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉన్న హీరోగా స‌త్తా చాటుతున్నాడు యంగ్ హీరో శర్వానంద్. స్లో అండ్ స్ట‌డీగా సినిమా లైఫును త‌న‌కు తానే తీర్చిదిద్దుకున్నాడు. లాక్ డౌన్ ముందు ఈ హీరో ‘జాను’ అనే మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అది అంత ఇంపాక్ట్ ఇవ్వ‌లేక‌పోయింది. కాగా ప్ర‌స్తుతం శ‌ర్వా ‘శ్రీకారం’ అనే ఫిల్మ్ చేస్తున్నాడు. వ్య‌వ‌సాయం నేపథ్యంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత శ‌ర్వానంద్ ఓ త‌మిళ నిర్మాత‌తో క‌లిసి ద్వి భాషా చిత్రం చిత్రం చేయ‌నున్న‌ట్టు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో టాక్ న‌డుస్తోంది.

శ‌ర్వానంద్ గ‌తంలో స్ట్రైట్ త‌మిళ సినిమాలు చాలా చేశాడు. జేకే ఎనుమ్ నన్‌బ‌నిన్‌, ఎంజియుమ్ ఎప్పొధుమ్( జ‌ర్నీ), వాజ్‌కాయ్( రాజాధి రాజా) వంటి సినిమాల‌తో అక్క‌డ అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. గ‌త ఐదేళ్లుగా తెలుగు ఇండ‌స్ట్రీపై మంచి ఫోక‌స్ పెట్టిన శ‌ర్వా.. త‌మిళం వైపు అడుగులు వేయ‌లేదు. అందుకే ఈ సారి ఆ లోటు తీర్చేలా తెలుగు, త‌మిళ్‌లో ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడు. ఎస్ఆర్ ప్ర‌భు నిర్మాణంలో ఈ బైలింగ్యువ‌ల్ మూవీని శ్రీ కార్తీక్ తెర‌కెక్కించ‌నున్నాడ‌ని తెలుస్తోంది‌. త్వ‌ర‌లో దీనికి సంబంధించి అధికారిక‌ ప్ర‌క‌ట‌న రానుంది.