AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క సినిమా… అటు ప్రొడ్యూసర్ కు 50వది.. ఇటు హీరోకు 15 వ మూవీ.. ఇంతకు ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటంటే..

శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో శంకర్‌ డైరెక్షన్ లో మెగాపవర్ స్టార్ చరణ్ హీరోగా దిల్ రాజు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టు దిల్ రాజు బ్యానర్‌ నుంచి వస్తున్న 50 వ సినిమా కాగా..

ఒక్క సినిమా... అటు ప్రొడ్యూసర్ కు 50వది.. ఇటు హీరోకు 15 వ మూవీ.. ఇంతకు ఆ  క్రేజీ ప్రాజెక్ట్ ఏంటంటే..
Rajeev Rayala
|

Updated on: Feb 15, 2021 | 1:31 AM

Share

Shankar-Ram Charan movie  : శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో శంకర్‌ డైరెక్షన్ లో మెగాపవర్ స్టార్ చరణ్ హీరోగా దిల్ రాజు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టు దిల్ రాజు బ్యానర్‌ నుంచి వస్తున్న 50 వ సినిమా కాగా… చరణ్ హీరోగా యాక్ట్‌ చేస్తున్న 15 వ సినిమా.. ఇలా ఓకే సినిమా ఇటు ఓ హీరోకు… అటు ఓ ప్రొడ్యూసర్‌కు ఓ మైల్ స్టోన్‌లా నిలవబోతోంది.  ఇక తమిళ స్టార్‌ డైరెక్టర్ శంకర్‌ రామ్‌ చరణ్ హీరోగా సినిమాను అనౌన్స్‌ చేయడంతో… తమిళ, తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా ఎలా ఉండాలనే టాక్‌లోనే టైం పాస్ చేస్తోంది. ఇక ఈ కాంబినేషన్ పై ఇండస్ట్రీ పెద్దలు కూడా మాట్లాడుతూ.. అప్పుడే ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. వీరిక తోడు డైరెక్టర్ శంకర్, హీరో రామ్‌ చరణ్‌లు కూడా.. సినిమాను స్టార్ట్‌ చేయడం కోసం ఈగర్‌లీ వెయిట్‌ చేస్తున్నామని ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమా పై నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌ మాట్లాడుతూ ‘‘మేం సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలవుతోంది. ఈ ప్రయాణంలో అగ్ర కథానాయకులతోనూ, కొత్తతరంతోనూ, దర్శకులతోనూ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రాల్ని రూపొందించాం. ఇప్పుడు మా 50వ సినిమాని చరణ్‌ కథానాయకుడిగా నిర్మిస్తుండడం ఆనందంగా ఉంది. చరణ్‌ – శంకర్‌ కలయిక, అది పాన్‌ ఇండియా స్థాయి చిత్రం అంటే అంచనాలు పెద్దయెత్తున ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే, ప్రేక్షకులంతా ఆస్వాదించేలా ఈ సినిమాని రూపొందిస్తాం. త్వరలోనే నటీనటులు, సాంకేతిక బృందం వివరాల్ని తెలియజేస్తాం’’ అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Young Indians of 2020: ఈ ఏడాది యువ డైనమిక్‌ వ్యక్తుల జాబితాలో చేరిన ఏకైక ఇండియన్ హీరోగా అల్లువారబ్బాయి రికార్డ్

Follow Us
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?