
తెలుగులో ‘కొత్త బంగారులోకం సినిమా’తో ఊహించని క్రేజ్ దక్కించుకుంది శ్వేతాబసు ప్రసాద్. ఆ తర్వాత ఆమె దక్షిణాది భాషల్లో చేసిన సినిమాల పెద్దగా విజయవంతం కాలేదు. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్లో వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. 2017 నుంచి సంవత్సరానికి ఓ మూవీ చొప్పున చేస్తోంది. అంతేకాకుండా వెబ్ సిరీస్ల్లోనూ నటిస్తోంది. తాజాగా ‘కామెడీ కపుల్’ అనే చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇందులో హిందీ నటుడు షకీబ్ సలీంతో కలిసి శ్వేతా ఆడిపాడనుంది. రొమాన్స్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీని నచికేత్ సమంత్ డైరెక్ట్ చేస్తున్నాడు. జీ5 సారథ్యంలో, యోడ్లే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. దర్శకుడు నచికేత్ గతంలో మరాఠీ సినిమాలు ‘గచ్చీ’, ‘హబడ్డీ’, ‘గుడ్ బడ్డీ గడ్బడీ’ తెరకెక్కించాడు. అయితే ‘కామెడీ కపుల్’ ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
ప్రస్తుతం శ్వేత.. ‘డాక్టర్.డాన్’ అనే వెబ్సిరీస్లోనూ యాక్ట్ చేస్తోంది. ఇందులో ఆమె రేఖ అనే లాయర్ పాత్ర పోషిస్తోంది. షకీబ్ చివరిగా సల్మాన్ నటించిన ‘రేస్-3’, కబీర్ఖాన్ స్పోర్ట్స్ డ్రామా ’83’లోనూ నటించాడు.