Saaho: ‘సాహో’కు సరిలేరు.. ‘లయన్ కింగ్’ బేజారు

| Edited By:

Sep 03, 2019 | 1:01 PM

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ దూసుకుపోతోంది. ముఖ్యంగా అన్ని ఇండస్ట్రీల బాక్సాఫీస్ వద్ద తన గర్జనను చూపిస్తున్నాడు ప్రభాస్. అంతేకాదు నాలుగు రోజుల్లో 41మిలియన్ డాలర్లను సంపాదించిన సాహో.. ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీల […]

Saaho: ‘సాహో’కు సరిలేరు.. ‘లయన్ కింగ్’ బేజారు
Follow us on

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ దూసుకుపోతోంది. ముఖ్యంగా అన్ని ఇండస్ట్రీల బాక్సాఫీస్ వద్ద తన గర్జనను చూపిస్తున్నాడు ప్రభాస్. అంతేకాదు నాలుగు రోజుల్లో 41మిలియన్ డాలర్లను సంపాదించిన సాహో.. ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీల లిస్ట్‌లో రెండో స్థానంలో నిలిచింది.

కాగా విడుదల రోజు నుంచి ఈ మూవీకి అన్ని భాషల్లోనూ ఫ్లాప్ టాక్ వినిపించింది. సినిమాను చూసిన పలువురు క్రిటిక్‌లు ‘‘అబ్బే.. ఇదేమి సాహో’’ అంటూ పెదవి విరిచారు. అయితే కలెక్షన్లు అందుకు భిన్నంగా ఉన్నాయి. క్రిటిక్స్ రివ్యూను ఏ మాత్రం పట్టించుకోని ఆడియెన్స్ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారిని సాహో మెప్పించడంతో వారు ఈ సినిమాకు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. దీంతో అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే నాలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కావడం.. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ క్రేజ్‌ అమాంతం పెరిగిపోవడం కూడా ‘సాహో’ కలెక్షన్లపై ప్రభావం చూపిందన్నది వారి మాట. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అత్యధిక థియేటర్లలో రిలీజైంది. ఈ నేపథ్యంలో మొదటి నాలుగు రోజులకు గానూ ముందుగానే ప్రీ బుకింగ్‌లు భారీగానే అయ్యాి. అందుకే మొదటి నాలుగు రోజుల్లో కలెక్షన్లు వస్తున్నాయన్నది కూడా టాక్. ఏది ఏమైనా.. టాక్ ఎలా ఉన్నా.. సాహో కలెక్షన్లు మాత్రం నిర్మాతలను కాస్త ఊరట కలిగించేవే.

ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటించగా.. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి గిబ్రాన్ నేపథ్య సంగీతం అందించిన విషయం తెలిసిందే.