బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం అన్ని ఇండస్ట్రీలలో కలకలం రేపుతోంది. సినిమా ఇండస్ట్రీలో నెపోటీజమ్ గురించి ఇప్పుడు అందరూ బయటకి వచ్చి మాట్లాడుతున్నారు. సుశాంత్ మరణం ముందు వరకూ కూడా నెపోటీజమ్ ఎటు వెళ్లిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇటీవల రేణు దేశాయ్ కూడా తనదైన శైలిలో స్పందించారు. నెపోటీజమ్ అనేది ఒక్క మూవీ ఇండస్ట్రీలోనే కాదు. ప్రతి చోటా ఉంటుంది. కానీ ఫైనల్ గా ఎవరైనా సరే టాలెంట్ తో ముందుకు వస్తేనే విజేతలు అవుతారని ఆమె చెప్పినట్టు సమాచారం.
సుశాంత్ మరణం గురించి మాట్లాడుతూ.. అతనిది చాలా సున్నితమైన మనస్తత్వం అని ఆమె వ్యాఖ్యానించినట్టు
తెలుస్తోంది. ఇక సుశాంత్ కి ప్రతిభ ఉంది కాబట్టే.. ఇన్నాళ్లు చిత్ర పరిశ్రమలో మంచి విజయాల్ని అందుకున్నాడు
అని ఆమె చెప్పినట్టు సమాచారం. తనకున్న ఆదరణ కూడా పెరిగింది. అయితే సుశాంత్ కొన్ని భావోద్వేగాల్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడని తెలుస్తోంది. ధైర్యంతో ఉండాల్సిన అతను తీవ్ర డిప్రెషన్ కి గురయ్యాడు. అందుకే అలాంటి కఠినమైన నిర్ణయం తీలుకున్నాడు. ఇక సినిమాల్లోకి వచ్చే ఎవరైనా సరే.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ని నమ్ముకొని రావొద్దు. ఒక మంచి నటుడిగా కొనసాగలి అంటే.. మనోధైర్యం కూడా చాలా అవసరం.. అంటూ రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు.