Tollywood: ఓరి దేవుడా.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా‌లో నటించిన ఈ బ్యూటీ గుర్తుందా.? ఇప్పుడు

|

Oct 21, 2024 | 1:35 PM

నువ్వొస్తానంటే నేనొద్దంటానా‌ సినిమాలో సిద్దార్థను ముగ్గులోకి దింపడానికి ట్రై చేసే యువతిగా అందంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది..? ఏం చేస్తోంది.. డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

Tollywood: ఓరి దేవుడా..  నువ్వొస్తానంటే నేనొద్దంటానా‌లో నటించిన ఈ బ్యూటీ గుర్తుందా.? ఇప్పుడు
Follow us on

నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఆల్ టైం క్లాసిక్. కొరియాగ్రాఫర్ ప్రభుదేవా డైరెక్టర్‌గా టర్న్ అయింది ఈ సినిమాతోనే. అన్ని విభాగాలు బాగా పనిచేస్తే.. సినిమా ఎంత చక్కగా వస్తుంది అనడానికి ఈ చిత్రం ఉదాహారణ.. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా చేసింది. 2005 లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో అందమైన ప్రేమ కథకు ఎమోషన్స్ జోడించి.. అద్భతంగా తీశారు. చిత్రంలోని అందరూ పాత్రలూ చాలా బాగుంటాయి. ముఖ్యంగా దివంగత శ్రీహరి.. హీరోయిన్ అన్న పాత్రలో ఒదిగిపోయారు. అలాగే ఈ సినిమా చాలా భాషల్లో రీమేక్ అయ్యి రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. తొమ్మిది భాషల్లోకి నువ్వొస్తానంటే నేనొద్దంటానా రీమేక్ అయ్యిందంటే సినిమా కంటెంట్ జనాలకు ఎంతలా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్, పరుచూరి గోపాలకృష్ణ, సునీల్, జయ ప్రకాశ్ రెడ్డి, అర్చన తదితరులు కీ రోల్స్‌లో నటించారు.

ఇక ఈ సినిమాలో సిద్దార్థ్‌ను ఇష్టపడే అమ్మాయిగా.. అతని తన వశం చేసుకోడానికి ప్రయత్నించే అమ్మాయిగా కనిపించిన నటి గుర్తదా.? ఆమె పేరు నందిత జెన్నిఫర్. తెలుగులో ఒక మూవీ మాత్రమే చేసిన ఈ బ్యూటీ.. తమిళ్‌లో చాలా సినిమాల్లో నటించింది. పలు స్పెషల్ సాంగ్స్‌లోనూ ఆడిపాడింది. అలాగే పలు టీవీ షోల్లోనూ మెప్పించింది.

ఇక  మ్యారేజ్ తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది ఈ చిన్నది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్‌గానే ఉంటుంది. రెగ్యులర్‌గా ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తోంది. ఈ అమ్మడు 2007లో కాశీవిశ్వనాథ్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. ఈ జంటకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు. ఇక సోషల్ మీడియాలో నందిత జెన్నిఫర్ ఫోటోలు తాజాగా ట్రెండ్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.