
తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుల్లో మొదటి వరుసలో ఉంటారు దర్శక రత్న దాసరి నారాయణరావు. ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు దాసరి. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్ పుటలకెక్కారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు దాసరి. అలాగే 53 సినిమాలు స్వయంగా నిర్మించారు. అంతే కాదు 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా పనిచేశాచేశారు. ఇక యాక్టర్ గా ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళం, కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా అందుకున్నారు. అంతే కాదు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు దాసరి. అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డారు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి.
దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికిందరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో 2017 మే 30న మరణించారు. నేడు ఆయన వర్ధంతి. అయితే ఇటీవల దాసరి సమాధికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ యాంకర్ షూటింగ్ నిమిత్తం చేవెళ్ల ఏరియాకు వెళ్లగా అక్కడ దాసరి సమాధి కనిపించింది. చుట్టూ పిచ్చిమొక్కలు. ఎవ్వరూ పట్టించుకోని పరిస్థితిలో చెత్త చెదారం పేరుకుపోయి కనిపించింది. అంత గొప్ప వ్యక్తి, సినిమా ఇండస్ట్రీకి ఎంతో సేవ చేసిన ఆయన సమాధిని అలా చూసేసారు నా మనసు చివ్వుక్కుమంది అంటూ ఆ యాంకర్ వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అది కాస్త వరాల అవ్వడంతో నటుడు మంచు మనోజ్ స్పందించారు. దాసరి సమాధిని శుబ్రపరిచే పనులు చేపట్టారు. దాసరి సమాధిని దర్శించుకొని ఆయనను స్మరించుకొని అక్కడ పరిసరాలు శుభ్రం చేయించారు మంచు మనోజ్. మనోజ్ తోపాటు గీత ఆర్ట్స్ వెంటనే స్పందించింది దాసరి సమాధి పునరుద్ధరణ పనులు చేపట్టింది. దాసరి నారాయణరావు జ్ఞాపకాలను గౌరవిస్తూ చేపట్టిన ఈ చర్యల పట్ల అభిమానులు, ప్రేక్షకులు అభినందిస్తున్నారు.
దాసరి సమాధి దుస్థితిపై స్పందించిన మంచు మనోజ్, గీతా ఆర్ట్స్
దివంగత దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై స్పందించిన నటుడు మంచు మనోజ్.. తన అభిమానులను అక్కడికి పంపించి శుభ్రపరిచే కార్యక్రమాలు ప్రారంభించారు. pic.twitter.com/GWBHCF1zRY
— 🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) May 30, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి