
సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో డ్రగ్స్ వ్యవహారం చక్కర్లు కొడుతూనే ఉంది. ఇప్పటికే ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసులో చాలా మంది చిక్కుకున్నారు. స్టార్ హీరోల, హీరోయిన్స్ పేర్లు కూడా డ్రగ్స్ కేసులో బయటకు వచ్చాయి. తాజాగా సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం చాలా కామన్ అంటూ ఓ మహిళా నిర్మాత చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. సినిమా షూటింగ్ సెట్స్లో డ్రగ్స్ వాడకం సర్వసాధారణమైందని, దీని కోసం ప్రత్యేక బడ్జెట్, ప్రత్యేక గదులు కూడా కేటాయిస్తున్నారని చెప్పి షాక్ ఇచ్చింది. ఇంతకూ మీ ఎవరంటే.. సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం గురించి ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో డ్రగ్స్ గురించి ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా డ్రగ్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది కూడా మలయాళ ఇండస్ట్రీ నిర్మాతే..
మలయాళ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం గురించి నిర్మాత, నటి సాండ్రా థామస్ తీవ్రమైన ఆరోపణలు చేసారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో, సినీ సెట్స్లో డ్రగ్స్ వాడకం సర్వసాధారణమైనదని, దీని కోసం ప్రత్యేక బడ్జెట్, ప్రత్యేక గదులు కూడా కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమవుతోందని, సినీ సంఘాలు ఈ విషయంలో చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని ఆమె విమర్శించారు.
సాండ్రా థామస్ మాట్లాడుతూ, “ఈ సమస్య గురించి అందరికీ తెలుసు, కానీ ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. డ్రగ్స్ వాడకం పురుషులు, మహిళలు, అన్ని స్థాయిల వారిలోనూ కనిపిస్తోంది” అని అన్నారు. ఈ సమస్యను అరికట్టడానికి సినీ సంఘాలు గట్టి చర్యలు తీసుకోవాలని, అలాగే సెట్స్లో మహిళా నిర్మాతలను ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలలో చేర్చాలని ఆమె సూచించారు. ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం పై ఇంకా గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉందని సాండ్రా థామస్ అభిప్రాయపడ్డారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి