Mahesh Babu: మహేష్ మూవీలో జక్కన్న మ్యాజిక్.. ఆ సీనే సినిమాకు హైలైట్ గా ఉండనుందట..!

Mahesh Babu Rajamouli movie latest news viral on social media

Mahesh Babu: మహేష్ మూవీలో జక్కన్న మ్యాజిక్.. ఆ సీనే సినిమాకు హైలైట్ గా ఉండనుందట..!
Mahesh Babu

Updated on: Oct 27, 2022 | 8:36 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మహేష్ సినిమా అంటేనే మాములుగా అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక మహేష్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు స్టార్ డైరెక్టర్స్ తో దాంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది. ముందుగా మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్.. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్‏తో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ మూవీ తర్వాత మహేష్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన జక్కన్న…తదుపరి సినిమా మహేష్‏తో చేయనుండడంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఇక టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్‏లో జక్కన్న మాట్లాడుతూ.. యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా ఉండనుందని చెప్పడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. అంతేకాదండోయ్.. వీరి కాంబోలో రాబోతున్న సినిమా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా రాబోతుందని రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

ఇక ఈ సినిమా గురించి రోజుకొక వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా వైరల్ అవుతోన్న వార్త ఏంటంటే.. ఈ సినిమా లో కొన్ని సన్నివేశాల కోసం ఆఫ్రికా అడవుల్లో పచ్చి మాంసం తినే కొందరు మనషులతో ఫైట్ సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నాడట. ఆ అడవి మనుషులతో మహేష్ బాబు చేయబోతున్న యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్స్ టీమ్ ను రంగంలోకి దించే ఉద్దేశ్యంతో జక్కన్న ఉన్నాడట. మరి ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

 

Follow Us