Maheshbabu: సూపర్ స్టార్ మహేష్ బాబు పోష్ ఏరియాలో ఖరీదైన ప్లాట్ కొనుగోలు.. ఖరీదు తెలిస్తే షాక్..

|

Dec 12, 2021 | 5:52 PM

Maheshbabu: మొన్న హీరో ప్రభాస్ అత్యంత ఖరీదు పెట్టి ఇటీవల విల్లాను కొనుగోలు చేసి వార్తల్లో నిలవగా తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హైదరాబాద్..

Maheshbabu: సూపర్ స్టార్ మహేష్ బాబు పోష్ ఏరియాలో ఖరీదైన ప్లాట్ కొనుగోలు.. ఖరీదు తెలిస్తే షాక్..
Mahesh Babu
Follow us on

Maheshbabu: మొన్న హీరో ప్రభాస్ అత్యంత ఖరీదు పెట్టి ఇటీవల విల్లాను కొనుగోలు చేసి వార్తల్లో నిలవగా తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ప్లాట్ కొనుగోలు చేసి.. వారాల్లో నిలిచారు. అవును మహేష్ బాబు జూబ్లీహిల్స్ లో  ఇటీవల మహేష్ బాబు 26 కోట్లు పెట్టి ప్లాటుని కొనుగోలు చేశారని .. స్థలం రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్ వివరాలతో సహా ఒక ప్రముఖ బిజినెస్ ఆన్ లైన్ పత్రిక వివరాలను వెల్లడించింది. 2021 నవంబరు 17న రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగినట్లు తెలిపింది. ఆంటీకాదు.. హైదరాబాద్ నగరంలోనే రెసిడెన్షియల్‌ ఏరియాల్లో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్‌లో ఇటీవల మహేశ్‌బాబు ప్లాటును కొన్నారు.

యర్రం విక్రాంత్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి మహేశ్‌బాబు 1442 గజాల ప్లాటును 26 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. స్టాంప్‌డ్యూటీ కింద రూ.1.43 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ కింద రూ.39 లక్షలు చెల్లించినట్లు పేర్కొంది. అయితే ఈ ఇంటి స్థలం కొనుగోలు విషయంపై వస్తున్న వార్తలపై ఇప్పటి వరకూ మహేష్ బాబు స్పందించలేదు. ఎటువంటి అధికారిక  ప్రకటన వెలువలేదు. సినిమాల విషయాన్ని వస్తే.. మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అనంతరం రాజమౌళి తో ఒక సినిమా చేయనున్నారు.

 

Also Read:  గడ్డకట్టిన రిజర్వాయర్ లో చిక్కుకున్న కుక్క… కాపాడిన పోలీసు ఆఫీసర్లు.. వీడియో వైరల్..