MAA Elections 2021: పాపం ఆ ఫ్యామిలీని చూస్తుంటే జాలేస్తుంది.. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు..

|

Oct 09, 2021 | 7:41 AM

మా ఎన్నికల తేదీ దగ్గర పడింది.. ఇంకా ఒక్కరోజు వ్యవదిమాత్రమే ఉంది. ఈ క్రమంలో ఎవరు అద్యక్షపదవిని దక్కించుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

MAA Elections 2021: పాపం ఆ ఫ్యామిలీని చూస్తుంటే జాలేస్తుంది.. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు..
Jeevitha
Follow us on

MAA Elections 2021: మా ఎన్నికల తేదీ దగ్గర పడింది.. ఇంకా ఒక్కరోజు వ్యవదిమాత్రమే ఉంది. ఈ క్రమంలో ఎవరు అద్యక్షపదవిని దక్కించుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఒకరిపై ఒకరు విద్వేషాన్ని కోపాన్ని కలిగి ఉన్నారు. ఎప్పటికప్పుడు మీడియా మీటింగుల్లో బయటపడుతూనే ఉన్నారు. ఒకే కుటుంబంలా కలిసి ఉంటాం అంటూనే కక్షలు సాధింపులకు తెర తీస్తూ..  మా ఎన్నికలను జనరల్ ఎలక్షన్స్‌లా మార్చేశారు. ఇక అక్టోబర్ 10న పోలింగ్ కి ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యురాలు అయినా జీవిత మంచు ఫ్యామిలీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  జీవిత ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఆమె జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ..నరేష్ తవ్విన గుంతలో మోహన్ బాబు ఫ్యామీలీ పడిందని ఆమె అన్నారు.

ప్రకాష్ రాజ్ ప్యానెల్ ని సమర్థిస్తూ జీవిత రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.  `మోహన్ బాబు  ఫ్యామిలీని  చూస్తుంటే జాలేస్తోంది. నరేశ్ తవ్విన గుంతలో ఆ ఫ్యామిలీ పడిపోయింది“ అని ఆమె  అన్నారు. `మా` విషయంలో నరేశ్ స్వార్థంతో పనిచేశారు. కానీ ప్రకాష్ రాజ్ అలా కాదు నిజాయతీగా పనిచేస్తారని అన్నారు. సేవ చేసేందుకు మాత్రమే తాను పోటీకి దిగుతున్నానని జీవిత తెలిపారు. మా సభ్యులు ప్రలోభాలకు లొంగి ఓట్లు వేయొద్దని అన్నారు. 60 పైబడిన వాళ్లు ఓటేసేందుకు వచ్చేందుకు వెనకాడుతున్నారని  జీవిత  అన్నారు. ఇక 10న జరిగే ఎన్నికలతో మా అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

CVL Narasimha Rao: సీవీఎల్‌ నరసింహరావు సంచలన నిర్ణయం.. మా సభ్యత్వానికి రాజీనామా

Big News Big Debate: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’లో పాత పగలు ఇప్పుడు తీర్చుకుంటున్నారా?

Aryan Khan Drugs Case: ఇప్పటివరకూ గోల్డెన్ స్పూన్‌తో సాగిన ఆర్యన్ ఖాన్ జీవితం.. రేపటి నుంచి ఎలా ఉండనున్నదంటే..