ఆ క్రికెటర్‌తో అనవసరంగా డేటింగ్ చేసా.. నా పిల్లలడిగితే ఏం చెప్పాలి.. హాట్ బ్యూటీ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది క్రికెటర్స్ తో ఎఫర్స్ పెట్టుకున్న వారు కూడా ఉన్నారు. కొంతమంది హీరోయిన్స్ పెళ్లి చేసుకొని సెటిల్ అయితే మరికొంతమంది క్రికెటర్స్ తో డేటింగ్ చేసి వార్తల్లో నిలుస్తుంటారు. వారిలో ఈ టాలీవుడ్ హీరోయిన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఆ క్రికెటర్‌తో అనవసరంగా డేటింగ్ చేసా.. నా పిల్లలడిగితే ఏం చెప్పాలి.. హాట్ బ్యూటీ కామెంట్స్
Actress Photos

Updated on: Jul 07, 2025 | 12:22 PM

టాలీవుడ్ లో ఈ అమ్మడు ఓ హాట్ బ్యూటీ. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది. హీరోయిన్ గా రాణిస్తూనే స్పెషల్ సాంగ్స్ తో అదరగొట్టింది. నిజానికి హీరోయిన్ గా కంటే స్పెషల్ సాంగ్స్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఈ వయ్యారి భామ. కెరీర్ బిగినింగ్ లో ఈ చిన్నది పలు యాడ్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఈ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యింది ఈ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? స్టార్ హీరోలతో స్టెప్పులేసింది.. అలాగే స్టార్ క్రికెటర్స్ తో ఎఫైర్స్ పెట్టుకుంది ఈ భామ. తాజాగా ఆమె స్టార్ క్రికెటర్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకూ ఆ భామ ఎవరంటే..

రాయ్ లక్ష్మి 2005లో తమిళ చిత్రం “కర్క కసదర”తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అదే ఏడాది కన్నడ చిత్రం “వాల్మీకి” లో శివ రాజ్‌కుమార్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో “కంచనమాల కేబుల్ టీవీ” (2005), “నీలి మేఘం” (2012), “బలుపు” (2013) వంటి చిత్రాలలో నటించింది. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొట్టింది. పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణలాంటి స్టార్ హీరోలతో స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాల స్పీడ్ తగ్గించింది.

ఇవి కూడా చదవండి

నటి రాయ్ లక్ష్మీ మహేంద్ర సింగ్ ధోనితో తనకు గతంలో ఉన్న రిలేషన్‌షిప్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాయ్ లక్ష్మీ ధోనితో తన సంబంధాన్ని “ఒక మచ్చ” గా అభివర్ణించింది. భవిష్యత్తులో తన పిల్లలు ఈ విషయం గురించి ప్రశ్నిస్తే తాను ఎలా సమాధానం చెప్పాలోనని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే గతంలో ధోనితో తనకు సంబంధం ఉందని వచ్చిన వార్తలను తాజాగా తవ్వి తీస్తున్నారని, ఇంటర్నెట్‌లో ఈ విషయాలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయని రాయ్ లక్ష్మీ అసహనం వ్యక్తం చేసింది. ఈ పిచ్చి ప్రచారాన్ని దూరం పెట్టాలని కోరింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..