Kiara Advani: ఆ రెండు సినిమాలతో బాలీవుడ్ కు లక్కీ మస్కట్ ముద్దుగుమ్మ..
నిన్న మొన్నటి వరకు కమర్షియల్ స్టార్గా మాత్రమే ఉన్న కియారా అద్వానీ ఇప్పుడు లక్కీ గర్ల్ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్నారు.
నిన్న మొన్నటి వరకు కమర్షియల్ స్టార్గా మాత్రమే ఉన్న కియారా అద్వానీ ఇప్పుడు లక్కీ గర్ల్ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్నారు. బాలీవుడ్లో ఒక్క హిట్టే గగనమనుకుంటున్న టైమ్లో వరుసగా రెండు సూపర్ హిట్స్ ఇచ్చి మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో చేరిపోయారు ఈ బ్యూటీ. దీంతో కియారా డేట్స్ కోసం క్యూ కడుతున్నారు మేకర్స్. ఆఫ్టర్ కోవిడ్ బాలీవుడ్ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ మూవీ భూల్ భులయ్యా 2. కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కిన ఈ హారర్ కామెడీ మూవీలో కియారానే హీరోయిన్. గ్లామర్ షోతో పాటు పర్ఫామెన్స్కు కూడా స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావటంతో కియారాకు మంచి పేరు వచ్చింది.
రీసెంట్గా జుగ్ జుగ్ జియో సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు ఈ బ్యూటీ. వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో అనిల్ కపూర్, నీతూ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. అయితే ఇంత మంది ఉన్నా… ఈ సినిమా సక్సెస్ ఎక్కువగా కియారాకే హెల్ప్ అయ్యింది. కోవిడ్ తరువాత రెండు.. వంద కోట్ల సినిమాలు ఖాతాలో వేసుకున్న ఒకే ఒక్క బాలీవుడ్ బ్యూటీగా రికార్డ్ సెట్ చేశారు కియారా. వరుస హిట్స్ రావటంతో కియారాను లక్కీ మస్కట్ అంటున్నారు మేకర్స్. అందుకే తమ సినిమాల్లోనూ హీరోయిన్గా కియారా అయితే బెటర్ అని ఫీల్ అవుతున్నారు. ప్రజెంట్ బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తున్న కియారా.. సౌత్లో రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీస్ కంప్లీట్ అయితే గాని.. మరో సినిమాకు కియారా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి లేదు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.