అడ్వాన్స్ ఇచ్చేశార‌ట‌..ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్..ఇక మీ ఊహ‌కే అంకితం..!

|

May 20, 2020 | 7:38 AM

‘కేజీఎఫ్‌’ వంటి భారీ చిత్రంతో ఒక్కసారిగా నేష‌న‌ల్ లెవ‌ల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. భారీ ఎలివేష‌న్ సీన్ల‌తో సౌత్ ఇండియా స్టార్ హీరోలా అటెన్ష‌న్ డ్రా చేశాడు. ఇప్పుడాయన ‘కేజీఎఫ్’ సీక్వెల్ తీసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆ సినిమా ప‌నులు చివ‌రిద‌శ‌కు వ‌చ్చేశాయి. ఈ నేపథ్యంలో త‌న నెక్ట్స్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు ప్రశాంత్‌. కాగా టాలీవుడ్ టాప్ చిత్రాల నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో ఓ […]

అడ్వాన్స్ ఇచ్చేశార‌ట‌..ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్..ఇక మీ ఊహ‌కే అంకితం..!
Follow us on

‘కేజీఎఫ్‌’ వంటి భారీ చిత్రంతో ఒక్కసారిగా నేష‌న‌ల్ లెవ‌ల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. భారీ ఎలివేష‌న్ సీన్ల‌తో సౌత్ ఇండియా స్టార్ హీరోలా అటెన్ష‌న్ డ్రా చేశాడు. ఇప్పుడాయన ‘కేజీఎఫ్’ సీక్వెల్ తీసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆ సినిమా ప‌నులు చివ‌రిద‌శ‌కు వ‌చ్చేశాయి. ఈ నేపథ్యంలో త‌న నెక్ట్స్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు ప్రశాంత్‌.

కాగా టాలీవుడ్ టాప్ చిత్రాల నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో ఓ మూవీ చేసేందుకు ప్రశాంత్‌ నీల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు చిత్రసీమలో వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీళ్ల కాంబోలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ఓ పాన్‌ ఇండియా మూవీ తెర‌కెక్కించ‌డానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే మైత్రీ సంస్థ ప్రశాంత్‌కు రూ.2కోట్లు అడ్వాన్సు ఇచ్చిన‌ట్టు ఇండ‌స్ట్రీ టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది 2022లో ఈ క్రేజీ మూవీ సెట్స్‌పైకి వెళ్తుందని తెలుస్తోంది.