కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించడంతో సెలబ్రిటీలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. టాలీవుడ్ అగ్రకథానాయిక కాజల్ అగర్వాల్ సైతం ఇంట్లోనే ఉంటూ కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతోంది. ప్రస్తుత సమయాన్ని బాగా వినియోగించుకున్నట్లు చెప్పిందీ అందాల తార.
“మెంటల్ గా ఫిట్గా ఉండేందుకు నేను రెండు దారులు ఎన్నకున్నా. మెదడును యాక్టీవ్ గా ఉంచడం కోసం ఆన్లైన్లో చెస్ నేర్చుకుంటున్నా. ఈ ఆటపై నాలెడ్జ్ ఉంది కానీ పూర్తిస్థాయి అనుభవం రాలేదు. ఇప్పుడు చురకైన ఎత్తులు వేస్తూ ఎవరినైనా బురిడీ కొట్టించగలనని అనిపిస్తోంది. ఇక మనసును ఉల్లాసంగా ఉంచుకునేందుకు ఎక్కువగా ఆధ్యాత్మికతకు సమయం కేటాయిస్తున్నా. రోజూ ఇంట్లో అమ్మ, అమ్మమ్మలతో కలిసి పురాణాల గురించి చర్చిస్తున్నా. అమ్మమ్మ భాగవత కథలను చాలా బాగా చెబుతోంది. నేను భగవద్గీత శ్లోకాల్ని నేర్చుకునేందుకు ట్రై చేస్తున్నా. ఇలాంటి సమయంలోనే దూరదర్శన్లో రామాయణ్, మహాభారత్ సీరియళ్లను రీ టెలికాస్ట్ చెయ్యడం భలే కలిసొచ్చింది. వాటిని చాలా విషయాలు తెలసుకుంటునన్నా” అని కాజల్ అగర్వాల్ పేర్కొంది.
కాగా తెలుగులో మంచు విష్ణు, కాజల్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘మోసగాళ్లుస రిలీజ్ కు సిద్ధంగా ఉంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్తో ఓ మూవీ సైన్ చేసింది.