
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ జబర్దస్త్ నటుడు లక్ష్మీ నారాయణ(28) అలియాస్ బాబీ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. బాబీ మాజీ ఎంపీ హర్ష కుమార్ దగ్గర డ్రైవర్ గా ఉండేవాడు. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోల్లో ఆర్టిస్ట్ గా చేశారు. రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో బాబీ మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు విషాదం లో మునిగిపోయారు. రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు అవ్వడంతో బాబీ కన్నుమూశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు యువకులు కూడా కన్నుమూశారు.
హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు పోయాయని తెలుస్తుంది. హెల్మెట్ పెట్టుకున్న ఓ యువకుడు మాత్రం ప్రాణాలతో బయట పడ్డాడు. రాజమహేంద్రవరంకు చెందిన బాబీ స్కూటీ పై కొవ్వూరు వెళ్తుండగా మరో బైక్ ను ఢీ కొట్టారు. దాంతో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మీ నారాయణ మృతికి పలువురు సినీ ప్రముఖులు, జబర్దస్త్ నటులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..