Sai Dharam Tej: స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. మరిన్ని వివరాలు

|

Sep 10, 2021 | 10:41 PM

చిరంజీవి మేనల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.  హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుత‌ప్పి సాయి ధ‌ర‌మ్ తేజ్ కింద‌ప‌డిపోయాడు.

Sai Dharam Tej: స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. మరిన్ని వివరాలు
Sai Dharam Tej 1
Follow us on

Sai Dharam Tej Accident: చిరంజీవి మేనల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.  హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుత‌ప్పి సాయి ధ‌ర‌మ్ తేజ్ కింద‌ప‌డిపోయాడు. ఈ ప్రమాదంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయిధరమ్ తేజ్‌ను పోలీసులు.. మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్ నుండి ఐకియా వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.  సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్న కథనాలతో మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఆయన కుటుంబ సభ్యులు పలువురు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రికి చేరుకున్న వారిలో చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది.

హెల్మెట్‌తో తప్పిన పెను ముప్పు..

స్పోర్ట్స్ బైక్‌ను అతివేగంగా నడిపినందునే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ వేసుకుని ఉండటంతో పెను ముప్పు తప్పినట్లు భావిస్తున్నారు.  ఓవర్ స్పీడ్ కారణంగా ఆ బైక్‌పై గతంలోనూ ఓ చలాన్ పెండింగ్‌లో ఉంది. ఈ ఏడాది అగస్టు 2న ఓ ఛలాన్ ఓవర్ స్పీడ్ కారణంగా నమోదయ్యింది.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం స్పృహలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని ఆస్పత్రి వర్గాలు తెలియజేసినట్లు తెలుస్తోంది. అటు సాయి ధరమ్ తేజ్ సన్నిహితులు కూడా ఆయన స్పృహలోకి వచ్చారన్న కథనాలను ధృవీకరించారు.

అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆస్పత్రి వర్గాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Also Read..

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. తీవ్రంగా గాయపడ్డ హీరో సాయి ధరమ్ తేజ్