Tollywood : టాలీవుడ్‌లో తోపులు ఈ ఇద్దరూ.. ఎవరో గుర్తుపట్టారా..?

|

Jul 27, 2024 | 8:45 PM

స్టార్ కిడ్స్ గా వచ్చిన అందరికీ అదృష్టం ఉండదు. సక్సెస్ కావాలంటే ప్రతిభ కూడా ఉండాలి అలా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. చాలా మంది నటీనటుల పిల్లలు, దర్శకుల పిల్లలు, అలాగే నిర్మాతల పిల్లలు ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ అందరూ సక్సెస్ కాలేదు. కానీ పైన కనిపిస్తున్న ఇద్దరినీ చూశారా.. ఆ ఇద్దరూ టాలీవుడ్ లో తోపులు. తన టాలెంట్ తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే చేతినండ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

Tollywood : టాలీవుడ్‌లో తోపులు ఈ ఇద్దరూ.. ఎవరో గుర్తుపట్టారా..?
Tollywood
Follow us on

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వారసులుగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. తమ టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఎంత స్టార్ కిడ్స్ గా వచ్చిన అందరికీ అదృష్టం ఉండదు. సక్సెస్ కావాలంటే ప్రతిభ కూడా ఉండాలి అలా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. చాలా మంది నటీనటుల పిల్లలు, దర్శకుల పిల్లలు, అలాగే నిర్మాతల పిల్లలు ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ అందరూ సక్సెస్ కాలేదు. కానీ పైన కనిపిస్తున్న ఇద్దరినీ చూశారా.. ఆ ఇద్దరూ టాలీవుడ్ లో తోపులు. తన టాలెంట్ తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే చేతినండ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ ఇద్దరూ ఎవరో గుర్తుపట్టారా.? ఇద్దరివీ వేరు వేరు ప్రొఫిషన్స్ అయినా తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇంతకూ ఆ ఇద్దరూ ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : హైపర్ ఆది వల్లే నేను జబర్దస్త్ మానేశా..? ఇప్పుడు సినిమాల్లో అలాంటి పాత్రలు ఇస్తామంటున్నారు..

పై ఫొటోలో ఉన్న ఇద్దరిలో ఒకరు స్టార్ హీరో.. మరొకరు ప్రముఖ కెమెరామెన్. ఇంతకూ ఆ ఇద్దరూ ఎవరంటే పైన కనిపిస్తున్న వారిలో ఒకరు సయంగ్ హీరో సందీప్ కిషన్. అకాగే మరొకరు కెమెరామన్ చోటా కే నాయుడు. కెమెరామెన్ గా చోటా కే నాయుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పంచి చేశారు. ఆయన మేనల్లుడిగా హీరో సందీప్ కిషన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తన నటనతో సందీప్ కిషన్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు.

ఇది కూడా చదవండి : Raviteja : ఒరేయ్ ఆజామో.. మన మాస్ రాజా కూతురు మెంటలెక్కించిందిగా..!!

స్నేహగీతం అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన సందీప్ కిషన్. ఆతర్వాత ప్రస్థానం సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకున్నాడు సందీప్ కిషన్. బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. షోర్‌ ఇన్‌ ద సిటీ అనే సినిమాతో హిందీలో పరిచయం అయ్యాడు. ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న సందీప్.. ఇప్పుడు పలు సినిమాల్లో సెకండ్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా ధనుష్ హీరోగా నటించిన రాయన్ సినిమాలో నటించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు సందీప్ కిషన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి