Tollywood: ‘రాజావారు రాణిగారు’ మూవీలో ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడు బాగా పాపులర్

|

Sep 16, 2024 | 8:23 AM

రాజా వారు రాణి గారు సినిమాలో శ్వేత క్యారెక్టర్ చేసింది ఈ అమ్మడు. హీరో ఫ్రెండ్ ఈమెను లైక్ చేస్తాడు. కానీ ఈమె మాత్రం.. హీరోను లైక్ చేస్తోంది. కార్తికేయ- అజయ్ భూపతి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఆర్ ఎక్స్ 100 మూవీలో కూడా యాక్ట్ చేసింది. తను ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తోంది.

Tollywood: ‘రాజావారు రాణిగారు’ మూవీలో ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడు బాగా పాపులర్
Divya Narni
Follow us on

రాజా వారు రాణి గారు సినిమాతో హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా ఓ మాదిరిగా ఆడింది. ఈ మూవీలో తన పెయిర్‌గా నటించిన రహస్య గోరఖ్‌ను ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు కిరణ్. ఈ జోడికి ఫ్యాన్స్ బెస్ట్ విషెస్ చెబుతున్నారు. క్లీన్ విలేజ్ లవ్ స్టోరీతో తెరెక్కిన ఈ చిత్రాన్ని 2019లో సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్‌ తీసుకుని విడుదల చేసింది. మూవీలో హీరో స్నేహితులుగా చేసి.. రాజ్ కుమార్ కసిరెడ్డి, యజుర్వేద్ గుర్రం నవ్వులు పూయించారు.  అలాగే హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్‌లో మెరిశారు ఇద్దరు తెలుగు అమ్మాయిలు. వీరిలో ఒకరు.. దివ్య నార్ని.  గోదావరి జిల్లా.. రాజమండ్రి ప్రాంతానికి చెందిన అమ్మాయి దివ్య. తొలుత టిక్ టాక్‌ ద్వారా పాపులర్ అయ్యి.. ఆర్జీవీ తీసిన వంగవీటి మూవీలో చాన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. సెన్సేషనల్ హిట్ మూవీ ఆర్ఎక్స్ 100 కూడా నటించింది. ఆ తర్వాత రాజావారు రాణివారు మూవీలో చాన్స్ పట్టేసింది. మూవీలో శ్వేత క్యారెక్టర్ చేసింది ఆమె. అలానే నాని జెర్సీ, తేజ సజ్జా మూవీ అద్భుతం, అడవి శేష్ హిట్ 2, ముఖ చిత్రం, బుట్టబొమ్మ, బెదురులంక సినిమాల్లో కనిపించింది. మరోవైపు సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్‌గా ఈ అమ్మడు జోష్ చూపిస్తోంది. అటు యాంకర్‌గానూ తన మార్క్ చూపిస్తోంది. ఢీ 15  పలు ఎపిసోడ్లలో యాంకర్‌గా వ్యహరించింది దివ్య నార్నే.

కాగా గోపాల్ కృష్ణా రెడ్డి అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకుంది దివ్య. గోవాలో అతడికి తనే ప్రపోజ్ చేసింది. నిశ్చయ తాంబూలాల సమయంలో టాటూ వేయించుకుని తనకు కాబోయే భర్తకు మెమెరబుల్ గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ నటి.. మళ్లీ సినిమాలు చేస్తుందో లేదో క్లారిటీ రావాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.